Software Engineer : సైక్లింగ్ చేస్తూ గుండె ఆగి మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

గతేడాది అక్టోబర్ లో కన్నుమూసిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం తరహాలోనే ఒక వ్యక్తి వ్యాయామం చేస్తూ కన్ను మూసిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు లో చోటు చేసుకుంది.

Software Engineer : సైక్లింగ్ చేస్తూ గుండె ఆగి మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Software Engineer

Software Engineer :  గతేడాది అక్టోబర్ లో కన్నుమూసిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం తరహాలోనే ఒక వ్యక్తి వ్యాయామం చేస్తూ కన్ను మూసిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు లో చోటు చేసుకుంది. పెళ్లై రెండు నెలలైనా కాక ముందే భర్త కన్నుమూయటంతో ఆ కొత్తపెళ్ళి కూతురు రోదన వర్ణనాతీతం.

పుంగనూరుకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సుధాకర రెడ్డికి  ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తేజ విష్ణువర్ధన్ రెడ్డి(27) బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.  అతనికి రెండు నెలల క్రితం కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్యతో వివాహం అయ్యింది.  ఆమె కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తోంది.

ఆషాఢమాసం కాబట్టి లావణ్య కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది.  ప్రతిరోజు వ్యాయమం చేసే విష్ణు వర్ధన్ రెడ్డి రోజు మాదిరిగా ఆదివారం ఉదయం గ్రామంలో సైక్లింగ్ చేస్తున్నాడు. కొంతదూరం వెళ్లాక  సైకిల్ మీద నుంచి కుప్పకూలి పడిపోయాడు. కుమారుడు పడిపోయాడని తెలుసుకున్న సుధాకర రెడ్డి ఈవిషయాన్ని గ్రామంలోని డాక్టర్ చైతన్య రెడ్డికి సమాచారం ఇచ్చాడు.

ఇద్దరూ  ఘటనా స్ధలం వద్దకు వచ్చారు. విష్ణును పరీక్షించిన డాక్టర్ గుండెపోటుతో మరణించినట్లు చెప్పారు. భర్త మృతి చెందిన విషయం తెలుసుకున్న లావణ్య గ్రామానికి చేరుకుని మృతదేహం చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆషాఢ మాసం పూర్తైన తర్వాత తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లేందుకు కొత్త జంట ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.  ఇంతలోనే ఈవిషాద ఘటన జరగటంతో అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు.

Also Read : Love Cheating : పారిపోయిన భర్త కోసం గర్భిణి నిరసన దీక్ష