AP Government : టీటీడీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీ ప్రభుత్వం టీటీడీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి చట్ట సవరణ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

AP Government : టీటీడీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Ttd

appointment of special invitees in TTD : ఏపీ ప్రభుత్వం టీటీడీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి చట్ట సవరణ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అలాగే దేవాదాయ శాఖకు చెందిన పలు చట్టాలను సవరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిపై ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇటీవల 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని హైకోర్టు నిలిపి వేసింది. దేవాదాయశాఖలోని ఏ సెక్షన్‌ ప్రకారం చేశారని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో వారి నియామకానికి వీలుగా చట్టసవరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం ద్వారా టీటీడీ ప్రతిష్ఠ మరింత పెంచేందుకు వీలుంటుందని భావిస్తోంది.

CM Jagan : మూడు పథకాలకు రూ. 2191 కోట్ల నిధులు విడుదల.. నేరుగా రైతుల ఖాతాల్లో జమ

శ్రీవారి భక్తులు, యాత్రికుల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక ఆహ్వానితుల నియామకం దోహదపడుతుందని ప్రతిపాదిస్తున్నారు. అలాగే దేవాదాయశాఖకు చెందిన పలు చట్టాల సవరణలపై నిర్ణయం తీసుకోనున్నారు.