AP High Court : కొండపల్లి మున్సిపల్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కొండపల్లి మున్సిపల్ ఎన్నికల వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.

AP High Court : కొండపల్లి మున్సిపల్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Kondapalli

Kondapalli municipal elections : కొండపల్లి మున్సిపల్ ఎన్నికల వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఇవాళ ఎన్నికను నిర్వహించకపోవడంపై మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్‌ అధికారి, విజయవాడ ఇంఛార్జ్‌ సీపీ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ ఉదయం కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో నాటకీయ పరిణామాలు జరిగాయి.

మేయర్ ఎన్నిక జరపాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు.. వాయిదా వేయాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు హోరెత్తించారు. కౌన్సిల్ హాల్లో వైసీపీ సభ్యులు గొడవకు దిగడంతో .. ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. అయితే ఆర్వో తీరును తప్పుబట్టిన టీడీపీ సభ్యులు.. ఎంపీ కేశినేని నాని.. హాల్‌లోనే బైఠాయించారు. హైకోర్టు రేపు ఎన్నిక నిర్వహించాల్సిందేనని ఆదేశించడంతో.. కౌన్సిల్ హాల్ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వచ్చారు.

AP : ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నిక

కొండపల్లి మున్సిపాలిటీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 14, టీడీపీ 14 స్థానాల్లో గెలిచాయి. మరో స్థానంలో గెలిచిన ఇండిపెండెంట్‌ టీడీపీలో చేరడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. ఇక ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, టీడీపీ ఎంపీ కేశినేని నాని నమోదు చేసుకున్నారు. దీంతో టీడీపీ బలం 16కు, వైసీపీ బలం 15కు చేరుకున్నాయి. అయితే, కేశినేని నానికి ఆ అర్హత లేదంటోంది వైసీపీ. కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ కుర్చీని తామే దక్కించుకుంటామని వైసీపీ చెబుతోంది.

అనేక రకాలుగా తమ సభ్యులను మభ్యపెట్టాలని చూశారని కేశినేని అన్నారు. తమ కౌన్సిలర్ల కుటుంబ సభ్యులను అధికార పార్టీ ఇబ్బంది పెడుతోందని తెలిపారు. పోలీసు రక్షణలోనే ఎన్నిక నిర్వహించాలని కోరారు. హైకోర్టు ఆదేశాలతో అయినా అధికారుల తీరు మారాలన్నారు. నిన్న, ఇవాళ జరిగిన పరిణామాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.