Thopudurthi Prakash Reddy: రూ.కోట్ల విలువచేసే భూములను వారికి రాసిచ్చారు: రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి

టీడీపీ నాయకురాలు పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం రూరల్ పరిధిలో భారీ భూ కుంభకోణం జరిగిందని ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. కోట్లు విలువ చేసే భూములు ఆమెకు అనుకూలంగా ఉన్న వారికి రాసిచ్చారని అన్నారు.

Thopudurthi Prakash Reddy: రూ.కోట్ల విలువచేసే భూములను వారికి రాసిచ్చారు: రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి

Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy: టీడీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ లోని రాప్తాడు ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ నాయకురాలు పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం రూరల్ పరిధిలో భారీ భూ కుంభకోణం జరిగిందని ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. రూ.కోట్లు విలువ చేసే భూములు ఆమెకు అనుకూలంగా ఉన్న వారికి రాసిచ్చారని అన్నారు.

మాజీ సైనికుల పేరుతో భూములు కాజేశారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు సహకరించారని, టీడీపీ నేతల వద్ద ప్రభుత్వ సీళ్లు కూడా ఉన్నాయని తెలిపారు. ఘంటా శ్రీనివాసులు అనే టీడీపి వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ట్రెజరీ ఉద్యోగి మనోజ్ తో కలసి అక్రమాలు చేశారని అన్నారు. 2014-19 మధ్య వంద నుంచి 200 కోట్ల రూపాయల విలువచేసే భూములు కాజేశారని తెలిపారు.

వీరి వద్ద నుంచి పరిటాల సునీత కమీషన్లు తీసుకుని సర్దుకున్నారని చెప్పారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు డబ్బు ఉంటే చాలు ఏ పనైనా చేస్తారని అన్నారు. అందుకే విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని అసెంబ్లీలో అడిగామని తెలిపారు. సోషల్ మీడియాలో టీడీపీ ఎంత దుష్ప్రచారం చేసినా తాము వారి అక్రమాలను బయటకు తీస్తూనే ఉంటామని చెప్పారు.

ప్రజలు తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అడుగుతూనే ఉన్నారని తెలిపారు. భూములన్నీ టీడీపీ నేతలు కాజేస్తే ఇక ఎక్కడ ఉంటాయి? అని నిలదీశారు. నారా లోకేశ్ పాదయాత్ర పై ప్రకాశ్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు వేశారు. రాప్తాడుకు ఎంతోమంది వస్తుంటారు, వెళుతుంటారని ప్రకాశ్ రెడ్డి ఒక్కడే ఇక్కడ ఉంటారని అన్నారు. రేపు లోకేశ్ కొందరితో సమావేశాలు జరుపుతారని, అవి జరిగాక వాటిపై స్పందిస్తానని తెలిపారు.

Razole: ఏపీ పాలిటిక్స్‌లో హీట్ రేపుతోన్న రాజోలు రాజకీయం.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే..