Chiranjeevi : ఏపీ సీఎం జగన్తో భేటీ విషయమై.. మెగాస్టార్ ఆధ్వర్యంలో మీటింగ్..
ఆంధ్ర ప్రదేశ్లో టిక్కెట్ రేట్ల సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నుండి చిరంజీవికి ఆహ్వానం అందింది..
Chiranjeevi: కరోనా క్రైసిస్ నేపథ్యంలో సినీపరిశ్రమ సమస్యలపైనా.. అలాగే ఆంధ్ర ప్రదేశ్లో టిక్కెట్ రేట్ల సమస్యలపైనా చర్చించేందుకు ఇటీవలే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నుండి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. మంత్రి పేర్ని నాని నేరుగా చిరుకి ఫోన్ చేసి సమావేశాని హాజరవ్వాలని చెప్పారు. అయితే ఈ భేటీలో సీఎంకి విన్నవించాల్సిన అన్ని విషయాలపైనా కూలంకుశంగా చర్చించి వెళ్లాలన్న ఉద్దేశంతో.. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఇండస్ట్రీ మీటింగ్ నిర్వహించారు.
Maa Elections 2021 : హేమకు స్వీట్ వార్నింగ్..
చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు నారాయణ దాస్ నారంగ్, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్. నారాయణ మూర్తి, దిల్ రాజు, కే.ఎస్. రామారావు, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్ నారంగ్, స్రవంతి రవి కిషోర్, సి. కళ్యాణ్, ఎన్వీ. ప్రసాద్, కొరటాల శివ, వి.వి. వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ, భోగవల్లి బాబీ, యూవీ క్రియేషన్స్ విక్కీ – వంశీ ఇలా.. నిర్మాతల సంఘం.. పంపిణీ, ఎగ్జిబిషన్ రంగాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇటీవల ఏపీలో వచ్చిన జీవోలో ఉన్న వాటిపై చర్చించారు. సీఎంతో సమస్యల పరిష్కారానికి మార్గాలేమిటి? అన్నదానిపై చర్చించారు. అన్నిటినీ త్వరగా పరిష్కరించాలన్నది ప్రధాన డిమాండ్. చిన్న నిర్మాతల సమస్యలపైనా సీఎంతో భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో టిక్కెట్ రేట్లపై చర్చించనున్నారు. గ్రామ పంచాయితీ, నగర పంచాయితీ, కార్పొరేషన్ ఏరియాల్లో టిక్కెట్ ధరలపై ఏం అడగాలి? చిన్న సినిమాల మనుగడ కోసం ఐదో షో విషయమై చర్చించుకోవడం జరిగింది.
Pawan Kalyan : క్లీన్ స్మాష్.. ‘భీమ్లా నాయక్’ ఆల్ టైమ్ టాప్ 1 రికార్డ్..
ఇండస్ట్రీలో నెలకొన్న అసంతృప్తి అంశాలపై సానుకూల వాతావరణం వచ్చేలా, అవన్నీ ఓ కొలిక్కి వచ్చేలా అందరూ కలిసి చర్చించుకోవడం జరిగింది. అలాగే పరిశ్రమలో అన్ని భాగాల్లో ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం కూలంకుషంగా చర్చించుకోవడం జరిగింది.