TTD Temple: శ్రీవారి ఆలయంలో శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం

నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ శ‌నివారం శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జ‌రుగ‌నుంది.

TTD Temple: శ్రీవారి ఆలయంలో శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం

TTD

TTD Temple: నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ శ‌నివారం శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జ‌రుగ‌నుంది.

ఈ పర్వదినం సందర్భంగా ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విశ్వక్‌సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు.

ఉదయం 7గంటల నుండి 9గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

Read Also : టీటీడీ ఉద్యోగులకు శుభవార్త.. నెరవేరనున్న సొంతింటి కల

అదే సమయంలో ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.