Campus Placement : కవల సోదరులు.. ఒక్కొక్కరికి రూ.50 లక్షలు
ఇద్దరు కవల సోదరులు ఒకే వేతనానికి సెలక్ట్ అయ్యి ఆశ్చర్యానికి గురిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇద్దరు సోదరులను గూగుల్ జపాన్ సంస్థ ఎంపిక చేసింది. చెరో రూ.50 లక్షలు ప్రకటించింది.
Campus Placement : ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో కవలలు రికార్డు స్థాయిలో వేతనం పొందారు. ఎస్ఆర్ఎం కాలేజీకి చెందిన కవల సోదరులు సప్తర్షి మంజుదార్, రాజర్షి మజుందార్లను గూగుల్ జపాన్ సంస్థ ఎంపిక చేసుకుంది. వీరికి చెరో రూ.50 లక్షల వార్షిక ప్యాకేజీని ఇవ్వనుంది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇదే అత్యధిక వేతనం.
ఈ ఎస్ఆర్ఎం కాలేజీకి చెందిన విద్యార్థుల్లో చాలామంది రికార్డు స్థాయిలో వేతనం పొందారు. 2021 పాస్ అవుట్ బ్యాచ్ విద్యార్థుల్లో కొందరు ఏడాదికి రూ. 7 లక్షల వార్షిక వేతనంతో వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఇక తమ కాలేజీకి చెందిన కవల సోదరులు భారీ వేతనంతో ఉద్యోగం సాధించడంతో కళాశాల యాజమాన్యం వారిని సత్కరించింది.. రెండు లక్షల రూపాయల చెక్ అందచేశారు. ఇక ఈ విషయంపై కవల సోదరులు స్పందించారు.
తాము ఈ స్థాయిలో వేతనం పొందుతామని అనుకోలేదని తెలిపారు. స్కూలింగ్ నుంచి ఇద్దరం కలిసే చదువుకున్నాం.. ఒకే సంస్థలో ఉద్యోగం పొందాలనుకున్నాం.. ఆ కల నెరవేరింది కానీ ఇంత వేతనం వస్తుందని ఎప్పుడు అనుకోలేదని తెలిపారు.