ఉత్తరాంధ్ర జాలర్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్ 

పాకిస్తాన్ చెర నుంచి విముక్తి పొందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. జాలర్లను సీఎం జగన్ సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 07:17 AM IST
ఉత్తరాంధ్ర జాలర్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్ 

పాకిస్తాన్ చెర నుంచి విముక్తి పొందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. జాలర్లను సీఎం జగన్ సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

పాకిస్తాన్ చెర నుంచి విముక్తి పొందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన మత్స్యకారులు..ఆయనతో సుమారు రెండు గంటలపాటు సమావేశం అయ్యారు. సీఎం జగన్.. జాలర్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  పాక్ జైలులో గడిపిన గడ్డు పరిస్థితులపై ఆరా తీశారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ జాలర్లను వెంట తీసుకుని వెళ్లారు. జాలర్లను సీఎం జగన్ సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

ఉత్తరాంధ్ర మత్స్యకారులు పాకిస్తాన్ చెర నుంచి విడుదలయ్యారు. నిన్న అమృత్ సర్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో మత్స్యకారులను హైదరాబాద్ తరలించారు. రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు వెళ్లారు. ఆ తర్వాత తమ స్వగ్రామాలకు బయల్దేరి వెళ్తారు. 20 మంది విడుదలతో బాధిత కుటుంబాల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. 

మొన్న భారతగడ్డపై 20 మంది మత్స్యకారులు అడుగుపెట్టారు. వాఘా వద్ద మత్స్యకారులను పాకిస్తాన్ భారత్ కు అప్పగించింది. అధికారులు మత్స్యకారులను వాఘా నుంచి అమృత్ సర్ కు తరలించారు. మత్స్యకారులు రాత్రి అమృత్ సర్ లోనే బస చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందిన 29 మంది మత్స్యకారులు 2018లో గుజరాత్ నుంచి పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారు. 

ఏడాది కాలంగా పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది జాలర్లు భారత్ చేరుకున్నారు. సోమవారం (జనవరి6, 2020) తేదీ సాయంత్రం వారిని పాక్ రేంజర్లు వాఘా సరిహద్దు వద్ద భారత సరిహద్దు భద్రతా సిబ్బందికి అప్పగించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన జాలర్లు. ఏపీ మత్య్సశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ వారిని అక్కడి నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చారు. 

ఉపాధి కోసం గుజరాత్ వెళ్లిన ఏపీకి చెందిన జాలర్లు డిసెంబర్ 2018 లో పాక్ జలాల్లోకి వెళ్లటంతో వారిని పాకిస్తాన్ నౌకాదళం అరెస్టు చేసింది. ఏపీలో జగన్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి  జయశంకర్ ను కలిసి జాలర్లను విడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయమై పలుమార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. దీంతో కేంద్ర విదేశాంగ శాఖ పాకిస్తాన్ తో చర్చలు జరిపింది.

ఉభయ దేశాల మధ్య జరిగిన చర్చలతో పాకిస్తాన్ జాలర్లను విడిచిపెట్టేందుకు అంగీకరించింది. మొత్తం 22 మంది తెలుగు జాలర్లు పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. వీరిలో 20 మంది ఇప్పుడు విడుదలయ్యారు. వీరిలో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందినవారు ఉన్నారు. మరో ఇద్దరు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారిని పాక్ త్వరలో విడుదల చేయనుంది. 

పాక్ జైళ్లలోని 20 మంది తెలుగు జాలర్లను డిసెంబర్5న పాకిస్తాన్ విడుదల చేసింది. వారిని రైలు ద్వారా లాహోర్ కు తరలించారు. అక్కడి ఇధి ఫౌండేషన్ వారికి మొన్న రాత్రి ఆశ్రయం ఇచ్చింది. నిన్న వారిని వాఘా సరిహద్దుకు తీసుకువచ్చిన పాక్ రేంజర్స్.. భారత సరిహద్దు భద్రతా సిబ్బందికి అప్పగించారు.