Vontimitta : ఒంటిమిట్ట రామాలయం.. బ్రహ్మోత్సవాలకు ముస్తాబు

ఈసారి శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపు లక్షకుపైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వారందరికీ ఎలాంటి...

Vontimitta : ఒంటిమిట్ట రామాలయం.. బ్రహ్మోత్సవాలకు ముస్తాబు

Vontimitta

Vontimitta Temple : కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయం… బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ప్రభుత్వ లాంఛనాలతో టీటీడీ ఆధ్వర్యంలో రేపటి నుంచి ఈనెల 18 వరకు ఘనంగా వీటిని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 2022, ఏప్రిల్ 09వ తేదీ శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు.

Read More : Vontimitta : ఏప్రిల్ 15న ఒంటిమిట్ట రామయ్య కల్యాణం.. టీటీడీ ఛైర్మన్ సమీక్ష

గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ప్రజలు లేకుండా తక్కువ భక్తుల మధ్య ఉత్సవాలు నిర్వహించారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావడం లేకపోవడంతో.. జనం మధ్య శ్రీరాముడి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో పకడ్బంధీగా చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More : Vontimitta : కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. టీటీడీ జేఈవో సమీక్ష

ఈసారి శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపు లక్షకుపైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. భక్తులకు చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. ఈ మేరకు ఆయన టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్‌ విజయరామరాజుతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.