Vontimitta : కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. టీటీడీ జేఈవో సమీక్ష

ద‌ర్శ‌నం, అన్న‌ప్ర‌సాదాల పంపిణీ వ‌ద్ద తోపులాట లేకుండా బ్యారికేడ్లు, ట్రాఫిక్ మ‌ళ్లింపుపు, క‌ల్యాణానికి వ‌చ్చే భ‌క్తుల‌కు పార్కింగ్ ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు...

Vontimitta : కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. టీటీడీ జేఈవో సమీక్ష

Vontimitta

Vontimitta Sri Kodandarama Swamy : ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజంపేట శాసనసభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి  తెలిపారు. 2022, మార్చి 28వ తేదీ సోమవారం కల్యాణ వేదిక వద్ద బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో టీటీడీ జేఈవో వీర‌బ్రహ్మంతో పాటు…సీవీఎస్ వో గోపినాథ్ జెట్టి, కడప జిల్లా ప్ర‌భుత్వ‌, పోలీస్ అధికారుల‌ున్నారు. పురాతన ప్రాశస్త్యం గల ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అంగ‌రంగ‌ వైభ‌వంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయడం జరుగుతోందని ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి వెల్లడించారు. మెరుగైన ఏర్పాట్ల కోసం అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగంతో కలిసి కల్యాణవేదిక వద్ద సమీక్ష సమావేశం జరిపారు.

Read More : CM Jagan : సీతారాముల కళ్యాణానికి సీఎం జగన్ దంపతులు.. 5వేల మందికే అవకాశం

ఈ సందర్భంగా టీటీడీ జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ… శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 15వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు మెరుగైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి విచ్చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగంతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. కల్యాణవేదిక వద్ద లక్ష మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా షెల్టర్లు, చలువపందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక మరుగుదొడ్లు, మొబైల్‌ మరుగుదొడ్లు, నీటి వసతి, పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేయాలన్నారు.

Read More : Sri Ramanavami 2022 : ఏప్రిల్ 10 నుండి ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

అనంత‌రం సీవీఎస్ వో మాట్లాడుతూ టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది, జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఆల‌య ప‌రిస‌రాలు, క‌ల్యాణ వేదిక వ‌ద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లోని భద్రతను పర్యవేక్షించ‌నున్న‌ట్లు చెప్పారు. ద‌ర్శ‌నం, అన్న‌ప్ర‌సాదాల పంపిణీ వ‌ద్ద తోపులాట లేకుండా బ్యారికేడ్లు, ట్రాఫిక్ మ‌ళ్లింపుపు, క‌ల్యాణానికి వ‌చ్చే భ‌క్తుల‌కు పార్కింగ్ ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఈ సమావేశంలో జెఈవో వెంట ఎస్ఇ (ఎల‌క్ట్రిక‌ల్స్‌) వెంక‌టేశ్వ‌ర్లు, ఈఈ సుమ‌తి, వీజీవో మ‌నోహ‌ర్‌, అద‌న‌పు ఆరోగ్య విభాగం అధికారి డా.సునీల్‌, డీఈ (ఎల‌క్ట్రిక‌ల్స్‌) చంద్ర‌శేఖ‌ర్‌, డిప్యూటి ఈవోలు డా. ర‌మ‌ణ ప్ర‌సాద్‌, ల‌క్ష్మ‌ణ్ నాయ‌క్‌, ఇత‌ర అధికారులు ఉన్నారు.