Ananthapuram : భర్తను చంపిన మొదటి భార్య…

ఆస్తి పంపకాల విషయంలో తన బిడ్డకు అన్యాయం జరుగుతుందని భావించిన మొదటి భార్య కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన  ఉమ్మడి అనంతపురం జిల్లలో చోటు చేసుకుంది.

Ananthapuram : భర్తను చంపిన మొదటి భార్య…

Ananthapuram

Ananthapuram : ఆస్తి పంపకాల విషయంలో తన బిడ్డకు అన్యాయం జరుగుతుందని భావించిన మొదటి భార్య కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన  ఉమ్మడి అనంతపురం జిల్లలో చోటు చేసుకుంది.  ముదిగుబ్బ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకటేష్ ఏపీఎస్ ఆర్టీసీ కదిరి డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటేష్ ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడు.

వెంకటేష్ రెండవ భార్యతో సన్నిహితంగా ఉండసాగాడు. ఈక్రమంలో రెండో భార్య కుమారుడుకి ఆస్తిలో వాటా ఎక్కువ వెళ్తుందని…. అది జీర్ణించుకోలేని మొదటి భార్య, భర్త వెంకటేష్ ని చంపాలని నిర్ణయించుకుంది. కుమారుడు, మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో భర్తను అంతమొందించింది.

మాట్లాడాలని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తీవ్రంగా రోకలి బండతో కొట్టి భర్తను హతమార్చింది. అనంతరం మరో ఇద్దరి సహాయంతో పొరుగున ఉన్న కర్నూలు జిల్లా అటవీ ప్రాంతంలోని చెట్ల పొదల్లో పడవేసి ఇంటికి చేరుకుంది.

భర్త కనిపించటంలేదని ముదిగుబ్బ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదంతా 8 నెలల క్రితం జరిగింది. 8 నెలల తరువాత మృతుడు వెంకటేష్ మొదటి భార్య కుమారుడు, నిందితుడు, ముదిగుబ్బ వీఆర్వో సమక్షంలో తామే చంపామంటూ ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో లొంగిపోవటంతో ఈ హత్య విషయం బయట పడింది. పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :Marriage Cheating : గుంటూరులో ఎన్నారై నిత్యపెళ్లి కొడుకు అరెస్ట్