YS Sharmila : వైఎస్ షర్మిల ఆస్తి పంపకాలు.. ఆ ఇద్దరికి తన ఆస్తులను రాసిచ్చింది

YS Sharmila : ఇడుపులపాయలో ఉన్న 9 ఎకరాల 50 సెంట్ల స్థలాన్ని.. 2 ఎకరాల 12 సెంట్ల స్థలాన్ని వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు షర్మిల.

YS Sharmila : వైఎస్ షర్మిల ఆస్తి పంపకాలు.. ఆ ఇద్దరికి తన ఆస్తులను రాసిచ్చింది

YS Sharmila

YS Sharmila Propeties : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆస్తుల పంపకం చేశారు. కడప జిల్లాలోని వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన షర్మిల తన పేరు మీదున్న కొన్ని ఆస్తులను కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలికి బదిలీ చేశారు. ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్న షర్మిల అక్కడి నుంచి కారులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. తన పేరు మీదున్న ఆస్తులన్నింటిని అటు కుమారుడికి, ఇటు కుమార్తెకి బదిలీ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇడుపులపాయలో ఉన్న 9 ఎకరాల 50 సెంట్ల స్థలాన్ని కుమారుడు వైఎస్ రాజారెడ్డి పేరు మీదు రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేకాకుండా 2 ఎకరాల 12 సెంట్ల స్థలాన్ని కుమార్తె అంజలి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు షర్మిల.

Also Read..Chandrababu Naidu: అన్నం తినే వ్యక్తి జగన్‌కు ఓటేయడు.. అంతేకాదు..: చంద్రబాబు

ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్న షర్మిల వెంటనే వేంపల్లెలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్పటికే సిద్ధంగా ఉన్న డాక్యుమెంట్ల మీద కొడుకు, కూతురితో కలిసి ఆమె సంతకాలు చేశారు. గతంలో తాను కొనుగోలు చేసిన ఒక నిమ్మతోటను సైతం కుమార్తె పేరు మీదనే రిజిస్ట్రర్ చేయించారు షర్మిల.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక పిల్లలు యుక్త వయసుకి రావడంతో ఈ పని చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. రేపు ఉదయం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు షర్మిల ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆస్తుల పంపకాలను కూడా పూర్తి చేసేశారు.

Also Read..Kethireddy Venkatarami Reddy : ధర్మవరం పట్టు చీరల వ్యాపారులపై విజయవాడ వ్యాపారి దాడి.. వైసీపీ ఎమ్మెల్యే సీరియస్, వదిలేది లేదని వార్నింగ్