Ap Government : నేడు పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ నగదు

ఏపీలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వరుసగా రెండో ఏడాది కూడా ఠంచన్‌గా నేడు బ్యాంకుల్లో వడ్డీ డబ్బులను ప్రభుత్వమే జమ చేయనుంది.

Ap Government : నేడు పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ నగదు

Zero Interest Cash For The Woman Of Savings Societies

Zero interest cash :  ఏపీలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వరుసగా రెండో ఏడాది కూడా ఠంచన్‌గా నేడు బ్యాంకుల్లో వడ్డీ డబ్బులను ప్రభుత్వమే జమ చేయనుంది. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 8.71 లక్షల పొదుపు సంఘాలకు 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి నెలాఖరు వరకు బ్యాంకు రుణాలపై ఉన్న వడ్డీ మొత్తాన్ని గతేడాది ఏప్రిల్‌ 24న చెల్లించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు సంఘాల రుణాలపై ఉన్న వడ్డీ మొత్తం రూ.1,109 కోట్లను సరిగ్గా ఏడాదికి..ఇవాళ చెల్లించనున్నారు.

బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సకాలంలో కిస్తీలు చెల్లించిన అక్కచెల్లెమ్మలకు ఆ రుణంపై వడ్డీ మొత్తాన్ని ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. సంఘాల వారీగా వడ్డీ డబ్బులను సీఎం జగన్‌ ఆన్‌లైన్‌ విధానంలో నేడు ఆయా సంఘాల రుణ ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లా స్థాయిలో ఇన్‌చార్జి మంత్రులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా 9,34,852 పొదుపు సంఘాలకు సంబంధించి 1.02 కోట్ల మంది మహిళలు బ్యాంకుల నుంచి రూ.19,989 కోట్ల రుణాలు తీసుకుని నిబంధనల ప్రకారం కిస్తీలు చెల్లించారు. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఆయా సంఘాలు సకాలంలో బ్యాంకులకు చెల్లించిన రుణాలపై రూ.1,109 కోట్ల మేర వడ్డీ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పారదర్శకత కోసం ప్రతి ఊరిలో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించింది.

పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ డబ్బులను చెల్లిస్తున్న సందర్భంగా సీఎం జగన్‌ లేఖలు రాశారు. ప్రతి మహిళను లక్షాధికారిగా, వ్యాపార రంగంలో తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను లేఖలో వివరించారు. లబ్ధిదారులకు నేటి నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు.