JioMart : జియోమార్ట్ ఫుల్ పైసా వసూలు సేల్… 30 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్
షాపింగ్ చేయాలనుకునేవారికి ఇండిపెండెన్స్ డే ఆఫర్ల వర్షం కురుస్తోంది. జియోమార్ట్, స్మార్ట్ సూపర్స్టోర్ కలిసి ఫుల్ పైసా వసూల్ సేల్ను ప్రారంభించబోతున్నాయి. అతిపెద్ద గ్రాసరీ ఫెస్టివల్ సేల్ ఇది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఈ సేల్ జరగనుంది.
JioMart : కస్టమర్లకు జియోమార్ట్ శుభవార్త చెప్పింది. ఆగస్టు 14 నుంచి 18 మధ్య ఫుల్ పైసా వసూల్ సేల్ ను నిర్వహిస్తుంది. ఈ సేల్ నిత్యావసర వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇవ్వనుంది. ఇక ఫ్రీ డెలివరీ ఫెసిలిటీ కూడా కల్పించింది జియో. దేశవ్యాప్తంగా ఉన్న 1200 పైగా స్మార్ట్ సూపర్ స్టోర్స్, స్మార్ట్ పాయింట్, రిలయన్స్ ఫ్రెష్ స్టోర్లలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు ఇంటికి కావాల్సిన సరుకులు కొనుగోలు చేసి అనేక ఆఫర్స్ పొందొచ్చు. ఈసారి అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి.
దుస్తులపై 50 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది రిలియన్స్, అంతేకాదు ఆహారపదార్దాలపై కూడా భారీ డిస్కౌంట్ ఇవ్వనుంది.
ఇక బిస్కెట్లు, చాకోలెట్లు, షాంపులపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. శీతల పానీయాలు, సబ్బులు, నూడిల్స్ పై 33 శాతం డిస్కౌంట్ ప్రకటించింది రిలియన్స్. డిటర్జెంట్ శ్రేణిపై 30 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన ప్యాకేజ్డ్ ఫుడ్, హోమ్ అండ్ పర్సనల్ కేర్, డెయిరీ, జనరల్ మర్కండైజ్పై ఆఫర్స్ ఉన్నాయి.
రూ.1,470 ఉన్న బాసుమతి రైస్ బ్యాగ్, నూనె కాంబో ప్యాక్ రూ.1049కే ఇస్తుంది. వినియోగదారులు స్టోర్ కి వెళ్లాల్సిన వసరం లేకుండా ఆన్లైన్ లో కూడా సరుకులు కొనవచ్చు. జియోమార్ట్ యాప్ లో ఆర్డర్ చేయవచ్చు.. ఫ్రీ డెలివరీ ఛార్జ్ తో ఇంటివద్దకు సరుకు తీసుకొస్తారు. అయితే కనీస పరిమితి ఆర్డర్ లేకుండా డెలివరీ చేయనున్నారు. ఇక ఈ సేల్ కి సంబంధించి ఇప్పటికే ప్రకటనలు ప్రారంభమయ్యారు. ప్రముఖ నటీనటులు ఫుల్ పైసా వసూల్ సేల్ ప్రచారం జోరుగా చేస్తున్నారు.
రిలయెన్స్ రీటైల్కు చెందిన సరికొత్త ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అయిన జియోమార్ట్ దేశవ్యాప్తంగా 200 పైగా పట్టణాలు, నగరాల్లో సేవలు అందిస్తోంది. జియోమార్ట్ ఫుల్ పైసా వసూల్ సేల్లో గూగుల్ పే ద్వారా పేమెంట్ చేసేవారికి క్యాష్బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. కనీసం రూ.599 సరుకులు కొని గూగుల్ పే ద్వారా పేమెంట్ చేస్తే యూజర్లకు స్క్రాచ్ కార్డ్ వస్తుంది. స్క్రాచ్ కార్డ్ ద్వారా రూ.100 వరకు క్యాష్బ్యాక్ పొందొచ్చు. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కొంటే 10 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది.
Alla re alla, Full Paisa Vasool Sale aala!
JioMart brings to you India’s biggest grocery sale from 14th to 18th August.Extra 10% cashback on SBI Debit & Credit Cards.
Download the #JioMart app or visit https://t.co/BP51e45JIq#FullPaisaVasoolSale pic.twitter.com/wJZbiVhat7
— JioMart (@JioMart) August 13, 2021