Russia-Ukraine : మండుతున్న చమురు ధరలు, భారత్ లో త్వరలో పెరిగే అవకాశం!

న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్ఛేంజీ ప్రకారం 5.24 డాలర్లు బెంచ్‌మార్క్‌ దాటింది. యూఎల్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర ప్రస్తుతం 108.60 డాలర్లకు చేరింది. యూఎల్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 5.43...

Russia-Ukraine : మండుతున్న చమురు ధరలు, భారత్ లో త్వరలో పెరిగే అవకాశం!

petrol

Updated On : March 2, 2022 / 1:05 PM IST

Russia-Ukraine Conflict : యుక్రెయిన్ దేశంపై రష్యా జరుపుతున్న యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతోంది. యుక్రెయిన్‌పై పోరులో తగ్గేదేలే అంటున్నాయి రష్యా బలగాలు. నిన్నటి నుంచి దాడుల విషయంలో గేర్‌ మార్చిన రష్యన్‌ ఆర్మీ.. ప్రధాన నగరాలపై నిరంతరంగా దాడులు చేస్తోంది. రాజధాని కీవ్‌ తర్వాత ఖార్కివ్‌ నగరంపై ఫోకస్‌ పెంచింది. ఈ రోజు ఖార్కివ్‌లోని మిలటరీ ఆస్పత్రి ముందు హోరాహోరిగా కాల్పులు జరిగాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇతర రంగాలపై పెను ప్రభావం చూపెడుతోంది. ఇండియన్ స్టాక్ మార్కెట్ కుదుపులకు గురవుతోంది. చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతర్జీయ మార్కెట్ లో భారీగా ధరలు పెరుగుతున్నాయి. 2022, మార్చి 02వ తేదీ బుధవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఐదు డాలర్లు బ్యారెల్ ధర పెరిగింది.

Read More : Sri Lanka : రష్యా – యుక్రెయిన్ యుద్ధం, లీటర్ పెట్రోల్ రూ. 204!

న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్ఛేంజీ ప్రకారం 5.24 డాలర్లు బెంచ్‌మార్క్‌ దాటింది. యూఎల్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర ప్రస్తుతం 108.60 డాలర్లకు చేరింది. యూఎల్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 5.43 డాలర్లు పెరిగింది. ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్ ధర ప్రస్తుతం 110.40 డాలర్లకు చేరుకుంది. త్వరలో భారత్ లో భారీగా చమురు ధరలు పెరగనున్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భారత్ లో బ్యారెల్‌ ధర 82-83 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఈ ధరలనే అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం బ్యారెల్‌ ధర 110.40 డాలర్లకు పెరగడంతో రానున్న రోజుల్లో భారీగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోలు, డీజిల్‌పై రికార్డు స్థాయిలో ధరల పెంపు ఉంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరల కట్టడి కోసం ఇప్పటికే కీలక నిర్ణయం ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ తీసుకుంది.

Read More : Russia-Ukraine War: ఇంట్లోనే పెట్రోల్ బాంబులు తయారు చేసి రష్యా సైనికులపై విరుచుకుపడుతున్న యుక్రెయిన్ ప్రజలు

60 మిలియన్‌ బ్యారెళ్ల చమురును వ్యూహాత్మక నిల్వల నుంచి విడుదల చేసేందుకు ‘ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ’లోని 31 దేశాలు అంగీకరించాయి. అమెరికా వివిధ దేశాలతో కలిసి వ్యూహాత్మక నిల్వ కేంద్రాల నుంచి దాదాపు మూడు కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ‘స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌’ ప్రసంగంలో ఈ విషయాన్ని బైడెన్ వెల్లడించారు. రష్యాపై తాము విధించిన ఆంక్షల ప్రభావం కేవలం ఆ దేశంపై మాత్రమే ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమెరికా వ్యాపారాలు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడతామన్నారు. చమురు ధరల కట్టడికి అమెరికా సహా ఇతర దేశాలు చర్యలు ప్రకటించినా.. చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి.