Jharkhand: స్కూటీపై వెళ్తున్న యువతి కిడ్నాప్… అత్యాచారానికి పాల్పడ్డ పది మంది

ఝార్ఖండ్‌లో ఒక యువతిపై పది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్కూటీపై స్నేహితుడితో కలిసి వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసి, దారుణానికి తెగబడ్డారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Jharkhand: స్కూటీపై వెళ్తున్న యువతి కిడ్నాప్… అత్యాచారానికి పాల్పడ్డ పది మంది

Jharkhand: ఝార్ఖండ్‌లో దారుణ ఘటన జరిగింది. స్నేహితుడితో వెళ్తున్న యువతిని కిడ్నాప్ చేసిన పది మంది దుండగులు, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఝార్ఖండ్, చాయ్‌బాసా ఏరోడ్రోమ్ ప్రాంతం, ముఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

India: తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు.. రెండేళ్ల కనిష్టానికి పడిపోయిన భారత విదేశీ నిల్వలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇంజనీర్ చదివిన బాధిత యువతి స్థానికంగా ఒక ఇంట్లో అద్దెకుంటూ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం స్నేహితుడితో కలిసి స్కూటీపై వెళ్తుండగా, పది మంది వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. వారిద్దరిపై దాడి చేసి, యువతిని లాక్కెళ్లారు. దగ్గర్లోని ఒక నిర్మానుష్య అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, పది మంది కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే, బాధిత యువతి తర్వాత వారి నుంచి తప్పించుకుంది.

Notice to Pawan kalyan: పవన్ కల్యాణ్ ‘మూడు పెళ్లిళ్ల’ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్.. నోటీసులు జారీ

కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పది మంది నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యకే బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పశ్చిమ సింగ్ భూమ్ ఎస్పీ తెలిపారు. నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాల్ని సేకరించామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.