Madhya Pradesh: డ్రైవింగ్ రాకుండానే డ్రైవింగ్.. పెళ్లి బృందంపైకి దూసుకెళ్లిన జీపు.. ఇద్దరు మృతి

అతిథులంతా రోడ్డుపై డ్యాన్స్ చేస్తున్నారు. అదే పెళ్లికి దగ్గర్లోని శ్యామ్‌పూర్ ప్రాంతం నుంచి కొందరు జీపులో వచ్చారు. వాళ్లు కూడా అక్కడి డ్యాన్స్ వేడుకలో డ్యాన్స్ చేయాలనుకున్నారు. జీపు డ్రైవర్ డ్యాన్స్ చేసేందుకు వెళ్తూ, వేరే వ్యక్తికి జీపు డ్రైవింగ్ చేయమని చెప్పాడు.

Madhya Pradesh: డ్రైవింగ్ రాకుండానే డ్రైవింగ్.. పెళ్లి బృందంపైకి దూసుకెళ్లిన జీపు.. ఇద్దరు మృతి

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెళ్లి వేడుకలో విషాదం జరిగింది. పెళ్లి బృందంపైకి ఒక జీపు దూసుకెళ్లడంతో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, శివపురి జిల్లాలో గత బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా బుధవారం రాత్రి ఒక పెళ్లి వేడుక జరిగింది.

Ajay Banga: వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి.. అజయ్ బంగాను ప్రతిపాదించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

ఈ సందర్భంగా అతిథులంతా రోడ్డుపై డ్యాన్స్ చేస్తున్నారు. అదే పెళ్లికి దగ్గర్లోని శ్యామ్‌పూర్ ప్రాంతం నుంచి కొందరు జీపులో వచ్చారు. వాళ్లు కూడా అక్కడి డ్యాన్స్ వేడుకలో డ్యాన్స్ చేయాలనుకున్నారు. జీపు డ్రైవర్ డ్యాన్స్ చేసేందుకు వెళ్తూ, వేరే వ్యక్తికి జీపు డ్రైవింగ్ చేయమని చెప్పాడు. అయితే అతడికి పూర్తిగా డ్రైవింగ్ రాదు. అయినప్పటికీ ఆ డ్రైవర్, వేరే వ్యక్తికి డ్రైవింగ్ అప్పగించి డ్యాన్స్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కొద్దిసేపు నెమ్మదిగానే అతడు డ్రైవింగ్ చేశాడు. తర్వాత ఉన్నట్లుండి యాక్సిలరేటర్ తొక్కడంతో అతడు దానిపై పట్టు కోల్పోయాడు.

వెంటనే వేగంగా ఆ జీపు పెళ్లి బృందంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.