Plane Crashed : రాజస్థాన్ లో కూలిన చార్టెడ్ విమానం

రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ లో చార్టెడ్ విమానం కుప్ప కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే చార్టెడ్ విమానం కుప్ప కూలిందని అనుమానిస్తున్నారు. విమానం కూలిన స్థలానికి అధికారులు, పోలీసులు హుటాహుటిన తరలి వచ్చారు.

Plane Crashed : రాజస్థాన్ లో కూలిన చార్టెడ్ విమానం

plane crashed

Plane Crashed : రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ లో చార్టెడ్ విమానం కుప్ప కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే చార్టెడ్ విమానం కుప్ప కూలిందని అనుమానిస్తున్నారు. విమానం కూలిన స్థలానికి అధికారులు, పోలీసులు హుటాహుటిన తరలి వచ్చారు. విమానం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు, పునరావాస పనులు చేపట్టామని భరత్ పూర్ జిల్లా కలెక్టర్ అనూప్ రంజన్ తెలిపారు. రాజస్థాన్ తోపాటు మధ్యప్రదేశ్ లో ఇవాళ మూడు విమానాలు కుప్పకూలాయి.

మరోవైపు ఇవాళ మధ్యప్రదేశ్ లో కూడా రెండు యుద్ధ విమానాలు కూలి పోవడం కలకలం సృష్టించింది. మధ్యప్రదేశ్ లోని మొరెనా సమీపంలో సుఖోయో-30, మిరాజ్ అనే రెండు యుద్ధ విమానాలు కుప్ప కూలాయి. భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు సాంకేతిక లోపం కారణంతోనే కూలాయిా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది ఇంకా తెలియాల్సివుంది. మధ్యప్రదేశ్ లోని యుద్ధ విమానాలు కూలిన ప్రాంతానికి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి.

Sukhoi, Mirage Aircraft Crash : మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్ యుద్ధ విమానాలు

సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఎయిర్ బేస్ నుంచి శిక్షణ కోసం విమానాలు బయల్దేరినట్లుగా తెలిసింది. ఇవాళ తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. సుఖోయ్-30 విమానం నుంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని, వారికి స్పల్ప గాయాలయ్యాని తెలిపారు.