లిఫ్ట్ ఇస్తానని బాలికపై గ్యాంగ్ రేప్ : వీళ్లను ఏం చేయాలి

రేపిస్టులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అయినా కామాంధులు

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 09:47 AM IST
లిఫ్ట్ ఇస్తానని బాలికపై గ్యాంగ్ రేప్ : వీళ్లను ఏం చేయాలి

రేపిస్టులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అయినా కామాంధులు

రేపిస్టులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అయినా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో మైనర్‌ బాలికపై ఇద్దరు కామాంధులు(వెంకటేశ్, రాజమోహన్ నాయక్) అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. రూరల్ మండలం ముళ్లపూడి గ్రామానికి చెందిన ఓ బాలికను.. లిఫ్ట్‌ ఇస్తామంటూ బైక్ ఎక్కించుకున్న యువకులు ఆమెను పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడ బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. తనను వదిలేయాలని బాధితురాలు వేడుకున్నా ఆ మృగాళ్లు కనికరించలేదు.

ఈ ఘటన ఆదివారం(డిసెంబర్ 8,2019) వెలుగులోకి వచ్చింది. తిరుచానూరు పోలీసుల విచారణ చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ”పద్మావతిపురం దగ్గర తిరుచానూరు వైపు వెళ్తున్న ఓ బైక్‌ను లిఫ్ట్ కావాలని అడిగింది బాలిక. తనను తిరుచానూరులో విడిచిపెట్టాలని కోరింది. అయితే, ఆ యువకుడు తిరుచానూరులో బైక్‌ను ఆపకుండా ముళ్లపూడి గేట్ వరకు తీసుకెళ్లాడు. బైక్‌లో పెట్రోల్ అయిపోయిందంటూ పక్కనే ఆపేసి.. తన మిత్రుడికి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి ఇద్దరూ బాలికిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశాం.. నిందితుల్లో ఒకరిపై గతంలో కేసులు ఉన్నాయి” అని తెలిపారు. 

బాలికపై అత్యాచారం కేసులో నిందితులు వెంకటేశ్, రాజమోహన్ నాయక్ ను అరెస్ట్ చేశామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. రాజమోహన్ నాయక్ పై గతంలో హత్య కేసు ఉందన్నారు. రౌడీ షీట్ కూడా ఉందని చెప్పారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు పెట్టామని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మహిళలు, యువతులు, చిన్నపిల్లలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆడపిల్ల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏ మృగాడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాడో అని మహిళలు భయపడుతున్నారు. బయటికి వెళ్లిన ఆడపిల్ల తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఏర్పడింది.