Karnataka : రోడ్డు ప్రమాదంలో భర్త మృతి…తెలుసుకున్న భార్య … ?

కర్ణాటకలో శనివారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోగా భార్య తన ఆరు నెలల కుమారుడికి ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.

Karnataka : రోడ్డు ప్రమాదంలో భర్త మృతి…తెలుసుకున్న భార్య … ?

Karnataka

Karnataka :  కర్ణాటకలో శనివారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోగా భార్య తన ఆరు నెలల కుమారుడికి ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.

వివరాలలోకి వెళితే….. మంగుళూరులోని అగ్నిమాపక కేంద్రంలో గంగాధర్(36) అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతనికి  భార్య శ్రుతి (30), ఆరు నెలల కుమారుడు అభిరామ్ ఉన్నారు. శనివారం రాత్రి గం. 8.50 నిమిషాల సమయంలో గంగాధర్ నేషనల్ హైవే 66 పై కుంటికాన సమీపంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తన్న కారు గంగాధర్ ను ఢీకొట్టింది. దీంతో గంగాధర్ ఘటనా స్ధలంలోనే కన్నుమూశాడు.

ఇదే విషయాన్ని రాయచూర్ జిల్లా లింగసుగూర్ లో పుట్టింట్లో ఉన్న శ్రుతికి పోలీసులు సమాచారం అందించారు. ఈఘటనతో ఆమె షాక్ లోకి వెళ్లిపోయింది.  భర్తలేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. రాత్రి  10 గంటల సమయంలో ఆరునెలల చిన్నారి అభిరామ్ ను హత్యచేసి తాను ఉరివేసుకుని తనువు చాలించింది.
Also Read : Honour Killing : భువనగిరి పరువు హత్యకేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఒక్క మరణంతో కుటుంబంలో ఊహించని పరిస్ధితులు తలెత్తటంతో ఆ కుటుంబం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వెళ్లి కేసు  నమోదు చేసుకుని దర్యాప్తు  చేపట్టారు.