Madhya Pradesh : భర్త బ్యూటీపార్లర్ కు వెళ్లనివ్వలేదని భార్య ఆత్మహత్య
పెళ్లై 15 ఏళ్లు అయినా బలరాం, రీనా యాదవ్ మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయని రీనా యాదవ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Madhya Pradesh : మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలో విషాదం నెలకొంది. భర్త బ్యూటీపార్లర్ కు వెళ్లనివ్వలేదని భార్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ ఎరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కీమ్ నెంబర్ 51 ప్రాంతంలో రీనా యాదవ్(34), బలరాం అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం భర్త బలరాం విధులకు వెళ్తుండగా తాను బ్యూటీపార్లర్ కు వెళ్తానని భార్య రీనా యాదవ్ అడిగారు. అందుకు భర్త ఒప్పుకోలేదు. బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దని చెప్పి విధులకు వెళ్లారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రీనా యాదవ్ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త బలరాం విధుల నుంచి తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి రీనా యాదవ్ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెంది ఉన్నారు. దీంతో ఆమె భర్త బలరాం పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
Maharashtra: హెయిర్ కటింగ్ నచ్చలేదని 16వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలుడు
కాగా, పెళ్లై 15 ఏళ్లు అయినా బలరాం, రీనా యాదవ్ మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయని రీనా యాదవ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమెను బ్యూటీపార్లర్కు వెళ్లొద్దని చెప్పడంతో ఆవేశంతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఆమె భర్త చెప్పారని సబ్ ఇన్స్పెక్టర్ ఉమాశంకర్ యాదవ్ తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.