Lecturer Suicide : విద్యార్ధిని సూసైడ్ చేసుకున్న వారానికి మ్యాథ్స్ లెక్చరర్ సూసైడ్…కారణం ?

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.    ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ (ప్లస్ టూ) చదువుతున్న విద్యార్ధిని లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారం రోజులుకు  ఆదే కా

Lecturer Suicide : విద్యార్ధిని సూసైడ్ చేసుకున్న వారానికి మ్యాథ్స్ లెక్చరర్ సూసైడ్…కారణం ?

Lecturer Suicide

Lecturer Suicide : తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.    ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ (ప్లస్ టూ) చదువుతున్న విద్యార్ధిని లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారం రోజులుకు  ఆదే కాలేజీలో పని చేస్తున్న మ్యాథ్స్ లెక్చరర్ ఆత్మహత్య చేసుకున్నారు.  ఈ ఘటనలు స్ధానికంగా కలకలం రేపాయి.

స్ధానిక వార్తా పత్రికల కధనాల ఆధారంగా…. తిరుచిరాపల్లికి   చెందిన ప్రైవేట్ స్కూల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్ధిని సూసైడ్ నోట్ రాసి గతవారం చనిపోయింది. తన సూసైడ్ నోట్ లో    ‘లైంగిక వేధింపుల కారణంగా కరూర్‌లో చనిపోయే చివరి అమ్మాయి నేనే కావాలి. నా ఈ నిర్ణయానికి కారణం ఎవరో చెప్పడానికి భయపడుతున్నాను. నేను ఈ భూమిపై చాలా కాలం జీవించాలని, ఇతరులకు సహాయం చేయాలని అనుకున్నాను.  కానీ ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తోంద’ని రాసి చనిపోయింది.
Also Read : Suspicious Death : హైదరాబాద్ లో నవ వధువు అనుమానాస్పద మృతి
విద్యార్ధిని ఆత్మహత్యపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు  విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఇంటర్ కాలేజీలో పలువురు విద్యార్ధులను, లెక్టరర్లను ప్రశ్నించారు. అందులో భాగంగా అక్కడే పని చేసే మ్యాథ్స్ లెక్చరర్ శరవణన్(42) కూడా ప్రశ్నించారు. అయితే ఈ ఘటన జరిగిన వారం తర్వాత శరవణన్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆయన రాసిన   సూసైడ్ లెటర్ లో శరవణన్ తను పడిన ఇబ్బంది  రాశాడు. బాలిక మరణం‌పై    విద్యార్ధులు తనను   ఆటపట్టించటంతో ఇబ్బంది పడ్డానని… బాలిక తన సూసైడ్ నోట్‌లో    ఎవరి పేరు రాయనప్పటికీ    అతనిపై అనుమానం   వ్యక్తం చేస్తూ పలువురు వ్యాఖ్యానించటంతో మనస్తాపానికి గురయ్యానని పేర్కోన్నాడు.

కాగా ….బాలిక మృతిలో మ్యాథ్స్ లెక్చరర్‌పై    ఎలాంటి అనుమానాలు  లేవని పోలీసు అధికారి ఒకరు నిర్ధారించారు.  మ్యాథ్స్ లెక్చరర్ మరణంపై వెనుక ఉన్న కారణాలు ఇంకా ఖచ్చితంగా బయటకు రాలేదని సమగ్ర  విచారణ తర్వాత అన్నివిషయాలు బయటకు వస్తాయి అని ఆయన తెలిపారు.