అయ్యో : భార్య మీద కోపంతో కోసేసుకున్నాడు

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లిలో ఘోరం జరిగింది. ఓ భర్త.. భార్య మీద కోపంతో నాలుక కోసేసుకున్నాడు. అతడి పేరు చిగుర్ల చంద్రయ్య. భార్య లింగమ్మతో

  • Published By: veegamteam ,Published On : August 22, 2019 / 02:17 AM IST
అయ్యో : భార్య మీద కోపంతో కోసేసుకున్నాడు

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లిలో ఘోరం జరిగింది. ఓ భర్త.. భార్య మీద కోపంతో నాలుక కోసేసుకున్నాడు. అతడి పేరు చిగుర్ల చంద్రయ్య. భార్య లింగమ్మతో

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లిలో ఘోరం జరిగింది. ఓ భర్త.. భార్య మీద కోపంతో నాలుక కోసేసుకున్నాడు. అతడి పేరు చిగుర్ల చంద్రయ్య. భార్య లింగమ్మతో మంగళవారం(ఆగస్టు 20,2019) రాత్రి  గొడవపడ్డాడు. రాతంత్రా కోపంతో ఊగిపోయాడు. అప్పటికీ కోపం చల్లారలేదో ఏమో.. బుధవారం(ఆగస్టు 21,2019) ఉదయం నాలుక కోసేసుకున్నాడు.

నోటి నుంచి రక్తం కారడం చూసిన తల్లి ముత్తమ్మ కంగారు పడింది. కొడుక్కి ఏమైందో తెలియక టెన్షన్ పడింది. ఏం జరిగిందా అని ఆరా తీస్తే, తెగిన నాలుక భాగాన్ని తీసి ఆమె చేతిలో పెట్టాడు కొడుకు చంద్రయ్య. వెంటనే చంద్రయ్యని అచ్చంపేటకు, అక్కడి నుంచి జిల్లా కేంద్ర  ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యమవడంతో నాలుకను తిరిగి అతికించే అవకాశమే లేదని డాక్టర్లు తేల్చిచెప్పారు.

చంద్రయ్య తీరుతో కుటుంబసభ్యులే కాదు స్థానికులు, డాక్టర్లు విస్తుపోయారు. మరీ ఇంత కోపమైతే ఎలా అంటున్నారు. భార్యభర్తల మధ్య కోపాలు, గొడవలు సహజమే.. కానీ ఇలా నాలుక కోసేసుకోవడం ఏంటి అని  విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కోపంలో చేసిన పనికి జీవితాంతం బాధ పడాల్సిన పరిస్థితి చంద్రయ్యకి ఏర్పడిందని తల్లి రోదిస్తోంది. ఎంత పని చేశావురా అని కన్నీరుమున్నీరవుతోంది.