ఇచ్చిన టీలో చక్కెర తగ్గిందని భార్యను చంపేశాడు!

  • Published By: srihari ,Published On : June 24, 2020 / 09:23 AM IST
ఇచ్చిన టీలో చక్కెర తగ్గిందని భార్యను చంపేశాడు!

భార్య ఇచ్చిన కప్పు టీలో చక్కెర తగ్గిందనే కోపంతో ఆమెను దారుణంగా హత్యచేశాడో భర్త. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లా,  బార్బర్ ప్రాంతంలో జరిగింది. ఒక కప్పు టీలో షుగర్ తక్కువగా వేసిందని 40 ఏళ్ల వ్యక్తి తన భార్య గర్భవతి అని చూడకుండా ఆమెను హత్యచేశాడు. బాబ్లూ కుమార్ అనే వ్యక్తి తన భార్యకు అందించిన టీలో చక్కెర తక్కువగా వేసిందని ఆగ్రహంతో ఊగిపోయాడు.

క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి తన భార్య రేణు (35) ను కొట్టి ఆమె గొంతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె కింద పడిపోయింది. తల్లి రేణుపై తండ్రి గట్టిగా కేకలు వేస్తున్న సమయంలోనే వారి ముగ్గురు పిల్లలు నిద్రలో నుంచి మేల్కున్నారు. వంటగదిలోకి వెళ్లి చూడగానే వారి తల్లి రక్తపు మడుగులో కొనఊపిరితో కనిపించింది. 

నిందితుడు బాబ్లూ 12 సంవత్సరాల క్రితం రేణుతో పెళ్లి అయింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రేణు తండ్రి బద్రీ ప్రసాద్ ఫిర్యాదు మేరకు బాబ్లూపై ఐపిసి సెక్షన్ 302 (మర్డర్) కింద FIR నమోదు అయింది. పాస్గావా పోలీస్ స్టేషన్ SHO రాకేశ్ కుమార్ ప్రకారం.. టీలో చక్కెర తక్కువగా వేసిందనే కోపంతో భార్యపై పదునైన కత్తితో గొంతు కోసి చంపాడు. హత్యకు ఉపయోగించని కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసు అధికారి తెలిపారు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. తన తండ్రే తమ తల్లిని హత్య చేశాడంటూ పిల్లలు సాక్ష్యమిచ్చారు. పిల్లల వారి స్టేట్మెంట్ తీసుకున్నామని రాకేశ్ కుమార్ వెల్లడించారు. 

Read: తల ఒక చోట, మొండెం మరో చోట… కడపలో రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్య