Viral Suicide Video : షాకింగ్ వీడియో.. 20 రూపాయల కోసం.. అంతా చూస్తుండగా రైలుకి ఎదురెళ్లి యువకుడి ఆత్మహత్య
ఓ 20 రూపాయలు.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అంతా చూస్తుండగానే ఆ యువకుడు రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
Viral Suicide Video : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇటావాలో దారుణం జరిగింది. ఓ 20 రూపాయలు.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అంతా చూస్తుండగానే ఆ యువకుడు రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వస్తున్న రైలుకి ఎదురుగా నిల్చుని ఆత్మహత్య చేసుకున్నదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యూపీలోని ఇటావాలో సలీమ్(35) అనే యువకుడు స్థానిక దుకాణదారుడికి రూ.20 బాకీ పడ్డాడు. ఈ క్రమంలో షాపు దగ్గరికి వెళ్లిన సలీమ్ తనకు పాన్ కావాలని అడిగాడు. అయితే, అప్పు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ముందు తన బాకీ చెల్లించాలని దుకాణదారుడు సలీమ్ ను అడిగాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. కొట్టుకునే వరకు వెళ్లింది.
సలీమ్ పై దుకాణదారుడు దాడికి దిగాడు. అతడితో పాటు అతడి బంధువులంతా సలీమ్ పై దాడి చేశారు. అతడిని తీవ్రంగా కొట్టారు. వారి దెబ్బలకు తాళలేకపోయిన సలీమ్ అక్కడి నుంచి నేరుగా షాప్ పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ పైకి వచ్చాడు. అదే సమయంలో వేగంగా రైలు వస్తోంది. దానికి ఎదురుగా నిల్చున్నాడు సలీమ్. వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో సలీమ్ స్పాట్ లోనే చనిపోయాడు. అంతా చూస్తుండగానే సలీమ్ ఇలా రైలుకి ఎదురెళ్లి సూసైడ్ చేసుకున్నాడు. కళ్ల ముందే ఘోరం జరిగిపోవడంతో అంతా షాక్ అయ్యారు. సలీమ్ రైల్వే ట్రాక్ పైకి రావడం, రైలు వేగంగా వచ్చి ఢీకొనడం, అతడు స్పాట్ లో చనిపోవడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది.
డిసెంబర్ 10న రాత్రి ఈ ఘోరం జరిగింది. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు కారణమైన దుకాణదారుడు సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్లు 147,323,306 కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
అయితే దుకాణదారుడు వాదన మరోలా ఉంది. సలీమ్ తన షాపులో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడని, దాంతో అతడిని కొట్టడం జరిగిందని చెప్పాడు. ఈ క్రమంలోనే తమ నుంచి తప్పించుకున్న సలీమ్.. రైలుకి ఎదురుగా వెళ్లి నిల్చున్నాడని అతడు పోలీసులతో చెప్పాడు.
In UP’s Etawah, a disturbing video of a man identified as Salim, 35, emerging from a crowd near railway tracks and dying by suicide has surfaced. It is being alleged that victim was beaten up duing a monetary dispute of Rs 20 at a shop when he took the extreme step. pic.twitter.com/V8kruFmhuQ
— Piyush Rai (@Benarasiyaa) December 15, 2022