Mother Son Escape : జస్ట్ మిస్.. రైల్వే స్టేషన్‌లో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న తల్లీకొడుకులు, వీడియో వైరల్

ఓ తల్లి, ఆమె కొడుకు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రైల్వే ట్రాక్, ప్లాట్ ఫామ్ కు మధ్య చిక్కుకున్న తల్లీకొడుకులు లక్కీగా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కర్నాటక రాష్ట్రం కాలబుర్గిలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.(Mother Son Escape)

Mother Son Escape : జస్ట్ మిస్.. రైల్వే స్టేషన్‌లో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న తల్లీకొడుకులు, వీడియో వైరల్

Mother Son Escape : ఇటీవలి కాలంలో రైల్వే స్టేషన్లలో ప్రమాదాల సంఖ్య పెరిగింది. వీటిలో కొన్ని అనుకోకుండా జరుగుతున్న ప్రమాదాలు కాగా, మరికొన్ని ప్రయాణికుల నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నాయి. ప్లాట్ ఫామ్ మారేందుకు కొందరు ప్రయాణికులు రైలు పట్టాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా, తొందరగా అటు పక్కకి వెళ్లొచ్చనే ఆలోచనతో ప్రాణాలను రిస్క్ పడేసుకుంటున్నారు. పట్టాలు దాటే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా రైల్వే ట్రాక్ దాటుతూ ఓ తల్లి ఆమె కొడుకు పెద్ద ప్రమాదంలో పడ్డారు. అయితే లక్కీగా బతికిపోయారు.

ఓ తల్లి, ఆమె కొడుకు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రైల్వే ట్రాక్, ప్లాట్ ఫామ్ కు మధ్య చిక్కుకున్న తల్లీకొడుకులు లక్కీగా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కర్నాటక రాష్ట్రం కాలబుర్గిలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

Also Read..Lady With Phone On Railway Track : నీ ఫోన్ పిచ్చి పాడుగాను.. ప్రాణం మీదకు వచ్చినా ఫోన్ మాట్లాడటం మాత్రం ఆపలేదు.. షాకింగ్ వీడియో

బుధవారం రాత్రి ఒక మహిళ తన కుమారుడితో కలిసి కాలబుర్గి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఒక ఫ్లామ్‌ఫామ్‌ నుంచి మరో ఫ్లాట్‌ఫామ్‌ కి వెళ్లేందుకు వారు రైలు పట్టాలపై దాటే ప్రయత్నం చేచారు. సరిగ్గా అదే సమయంలో సడెన్ గా గూడ్స్ రైలు వచ్చింది. ఇది గమనించిన వారిద్దరూ భయాందోళనకు గురయ్యారు. తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. దీంతో వారిద్దరూ ఫ్లాట్‌ఫామ్‌ కింద గోడ అంచున ఉండిపోయారు. పక్క నుంచే వేగంగా వెళ్తున్న ట్రైన్ ను చూసి కొడుకు బాగా భయపడిపోయాడు. తల్లిని గట్టిగా పట్టుకున్నాడు. రైలు వెళ్లే వరకు ఇద్దరూ అలాగే ఉండిపోయి తమ ప్రాణాలు కాపాడుకున్నారు.

Also Read..Student Stuck Between Train And Platform : నరకం చూసి యువతి మృతి, దువ్వాడ రైల్వేస్టేషన్‌లో గాయపడ్డ శశికళ కథ విషాదాంతం

ఆ గూడ్స్‌ రైలు వెళ్లిన తర్వాత వారిద్దరూ పైకి లేచి ఫ్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు. అదృష్టవశాత్తు ఆ మహిళ, ఆమె కుమారుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు ఇది చూసి తీవ్ర ఆందోళన చెందారు. అయితే తల్లి, కుమారుడు క్షేమంగా బయటపడటంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.