Lady With Phone On Railway Track : నీ ఫోన్ పిచ్చి పాడుగాను.. ప్రాణం మీదకు వచ్చినా ఫోన్ మాట్లాడటం మాత్రం ఆపలేదు.. షాకింగ్ వీడియో

రైలు పట్టాలు దాటుతున్న సమయంలో కూడా ఓ యువతి ఫోన్ లో మాట్లాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఫోన్ మాట్లాడుతూనే రైలు కింద పడుకోవడం, లేచిన తర్వాత కూడా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.

Lady With Phone On Railway Track : నీ ఫోన్ పిచ్చి పాడుగాను.. ప్రాణం మీదకు వచ్చినా ఫోన్ మాట్లాడటం మాత్రం ఆపలేదు.. షాకింగ్ వీడియో

Lady With Phone On Railway Track : ఈ రోజుల్లో ఫోన్లు అందరి జీవితాల్లో భాగమైపోయాయి. చిన్న, పెద్ద.. ధనిక, పేద.. అనే తేడా లేదు. దాదాపు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి. కాగా, కొంతమంది ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. నిత్యం ఫోన్ తో గడుపుతున్నారు. నీళ్లు, తిండి లేకపోయినా ఉండగలుగుతారు కానీ, ఫోన్ లేకపోతే మాత్రం ఒక్క సెకను కూడా తట్టుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలో కొంతమంది ఫోన్ లో మునిగిపోయి.. నిర్లక్ష్య వైఖరితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు, మరికొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. ఎక్కడ ఉన్నాము, ఏ పరిస్థితుల్లో ఉన్నామో కూడా పట్టించుకోకుండా ప్రాణాలను రిస్క్ లో పడేసుకుంటున్నారు.

Also Read : Theft In Gold Shop : OMG.. చీరను అడ్డం పెట్టుకుని జస్ట్ 20 సెకన్లలో రూ.10లక్షల గోల్డ్ నెక్లెస్‌ను ఎలా కొట్టేసిందో చూడండి..

రైలు పట్టాలు దాటుతున్న సమయంలో కూడా ఓ యువతి ఫోన్ లో మాట్లాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. సడెన్ గా రైలు రావడంతో పట్టాల మీద పడుకుండి పోయింది. ట్రైన్ వెళ్లిపోయాక, ఆ యువతి ట్రాక్ పై నుంచి లేచింది. ఆ వెంటనే మళ్లీ ఫోన్ లో మాట్లాడటం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఓ యువతి ఫోన్ మాట్లాడుతూ రైలు పట్టాలను దాటుతోంది. అంతలో సడెన్ గా ట్రైన్ వచ్చింది. అంతే, ఆ యువతి రైలు పట్టాలపై పడుకుంది. ట్రైన్ వెళ్లిపోయాక పైకి లేచింది. సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది.

Also Read : Tiger Attack: బాబోయ్.. ఒక్కసారిగా దూసుకొచ్చింది.. పులిని దగ్గరగా చూడాలనుకుంటే ఇలానే ఉంటది..! వీడియో వైరల్

అయితే, షాకింగ్ విషయం ఏంటంటే.. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ యువతి ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది. ఫోన్ మాట్లాడుతూనే రైలు కింద పడుకోవడం, లేచిన తర్వాత ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు కూడా ఫోన్ మాట్లాడటం ఏంటమ్మా? మరీ ఇంత పిచ్చా? దిసీజ్ టూ మచ్.. ప్రాణం కన్నా ఫోన్ ఎక్కువైపోయిందా నీకు? అని నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ ఘటన హర్యానా రోహ్ తక్ లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఇది ఇప్పుడు జరిగిన ఘటన కాదు. ఏడు నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ గా తెలుస్తోంది. కాగా, ఇప్పుడీ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్మార్ట్ ఫోన్.. మనుషుల జీవితాలతో ఏ విధంగా ఆడుకుంటుందో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం.