Indian married woman Anju : పాక్ వెళ్లిన నా కుమార్తె మానసిక క్షోభకు గురైంది… అంజూ తండ్రి వెల్లడి
పాకిస్థాన్ వెళ్లిన తన కుమార్తె అంజు మానసిక క్షోభకు గురైందని ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ చెప్పారు. తన ఫేస్బుక్ స్నేహితుడిని కలవడానికి పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని మారుమూల గ్రామానికి చట్టబద్ధంగా వెళ్లిన వివాహిత భారతీయ మహిళ అంజూ గురించి ఆమె తండ్రి పలు విషయాలు వెల్లడించారు...
Indian married woman Anju : పాకిస్థాన్ వెళ్లిన తన కుమార్తె అంజు మానసిక క్షోభకు గురైందని ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ చెప్పారు. తన ఫేస్బుక్ స్నేహితుడిని కలవడానికి పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని మారుమూల గ్రామానికి చట్టబద్ధంగా వెళ్లిన వివాహిత భారతీయ మహిళ అంజూ గురించి ఆమె తండ్రి పలు విషయాలు వెల్లడించారు. (Father of Indian woman) అంజు (34) అనే మహిళ ఉత్తరప్రదేశ్లోని కైలోర్ గ్రామంలో జన్మించింది. అనంతరం రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో నివసించింది.
Indian woman : భారతీయ మహిళ ఫేస్బుక్ స్నేహితుడిని కలవడానికి పాక్ వెళ్లింది…
అంజూ పాకిస్థాన్ జాతీయుడు నస్రుల్లా (29)తో 2019వ సంవత్సరంలో ఫేస్బుక్ ద్వారా స్నేహితులయ్యారు. అంజు నస్రుల్లాను కలవడానికి చెల్లుబాటు అయ్యే పాకిస్తాన్ వీసాపై గిరిజన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని అప్పర్ దిర్ జిల్లాకు వెళ్లింది. (woman who went to Pak for Facebook friend) తన కుమార్తె అంజూ మానసికంగా కలవరానికి గురైంది తప్ప (Mentally disturbed) పాక్ యువకుడితో ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని ఆమె తండ్రి థామస్ స్పష్టం చేశారు.
తన కుమార్తె పాకిస్థాన్ వెళ్లిన విషయం తన కుమారుడి ద్వారా నిన్ననే తెలిసిందని, అంజూకు పెళ్లి చేసిన తర్వాత 20 ఏళ్లుగా తనకు సంబంధాలు లేవని తండ్రి చెప్పారు. తన కుమార్తెను తాను ఎన్నడూ ఇంటికి ఆహ్వానించక పోవడంతో ఆమె మానసిక క్షోభకు గురైందని తండ్రి పేర్కొన్నాడు. తన అల్లుడు సాదాసీదా వ్యక్తి అని, తన కుమార్తెలో స్వేచ్ఛా స్వభావం ఎక్కువని థామస్ చెప్పారు. వీసా గడువు ముగియడంతో అంజూ ఆగస్టు 20వతేదీన భారత్కు తిరిగి వస్తుందని ఆమె పాకిస్థానీ స్నేహితుడు నస్రుల్లా తెలిపారు. తమ మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు.
MERS-Coronavirus : అబుదాబీలో ప్రాణాంతకమైన మెర్స్ కరోనావైరస్ పాజిటివ్ కేసు
అంజుని పెళ్లి చేసుకునే ఆలోచన లేదని నస్రుల్లా చెప్పారు. అంజు తన కుటుంబంలోని ఇతర మహిళా సభ్యులతో కలిసి ప్రత్యేక గదిలో నివసిస్తోందని నస్రుల్లా తెలిపారు. తమ స్నేహంలో ప్రేమ కోణం లేదని, అంజు ఆగస్టు 20న భారత్కు తిరిగి వస్తుందని స్థానిక పాక్ అధికారులకు నస్రుల్లా అఫిడవిట్ ఇచ్చాడు. ఆ అఫిడవిట్లో అంజూ ఎగువ దిర్ జిల్లా నుంచి బయటకు వెళ్లదని కూడా స్పష్టం చేశారు.