Love Story Tragedy : ఎనిమిదేళ్ల ప్రేమ, సహజీవనం-విషాదాంతం

మహారాష్ట్ర ముంబైలోని వసాయ్ కు చెందిన సాగర్ అరుణ్ నాయక్(29) సయానీ సనానే(26) ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలిసింది. రెండు కుటుంబాలు కూర్చుని వారి ప్రేమను అంగ

Love Story Tragedy : ఎనిమిదేళ్ల  ప్రేమ, సహజీవనం-విషాదాంతం

Love story tragedy

Love Story Tragedy : మహారాష్ట్ర ముంబైలోని వసాయ్ కు చెందిన సాగర్ అరుణ్ నాయక్(29) సయానీ సనానే(26) ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలిసింది. రెండు కుటుంబాలు కూర్చుని వారి ప్రేమను అంగీకరించారు.  ఇద్దరికీ త్వరలో పెళ్లి చేయాలని  నిర్ణయించుకున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు ఇద్దరూ వేర్వేరు చోట్ల విగతజీవులయ్యారు.

ఫిబ్రవరి 27వ తేదీన పాప్డి లోని ఒక హోటల్ లో ఈజంట దిగారు. ఆతర్వాత రోజు రూమ్ లోంచి ఎవరూ బయటకు రాకపోవటంతో హోటల్ సిబ్బంది తలుపులు కొట్టారు. అయినా సమాధానం లేకపోవటంతో తలుపులు పగల గొట్టిచూశారు. లోపల సయానీ విగత జీవిగా కనిపించింది.

పంబ్లింగ్   పనిముట్టుతో ఆమెను గాయపరిచి హత్య చేశారు ఎవరో. ఆగదిలో దిగిన అరుణ్ నాయక్ అక్కడ కనిపించకపోవటంతో పోలీసులు ఈ కేసులో అనుమానితుడుగా ప్రియుడు సాగర్ పేరును చేర్చి అతని కోసం గాలింపు చేపట్టారు.
Also Read : Marriage Cheating : తాళి కట్టే సమయానికి పరారైన పెళ్లి కొడుకు
సరిగ్గా వారం తర్వాత బీహార్ లోని ఒక హోటల్ గదిలో సాగర్ శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం సయానీ మరణం తర్వాత సాగర్ బీహార్ పారిపోయాడు. ముజఫర పూర్ లోని ఆస్తా హోటల్ లో దిగాడు. మార్చి 6వ తేదీన హోటల్ ఖాళీ చేయాల్సి ఉండగా అది జరగలేదు.

దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది అతడ్ని సంప్రదించటానికి ప్రయత్నించారు. అతడి నుంచి సమాధానం లేదు. రూమ్ వద్దకు  వచ్చి డోర్ కొట్టినా తీయలేదు. దీంతోవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హోటల్ కు వచ్చిన పోలీసులు సిబ్బంది సహాయంతో డోరు పగల కొట్టి చూశారు.
Also Read : Jharkhand : గుర్రం ఎక్కి అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే..
లోపల బాత్ రూంలో సాగర్ మృతదేహం పడి ఉంది. అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఏది ఏమైనా రెండు మరణాల లోనూ మిస్టరీ వీడాల్సి ఉంది.కుటుంబ సభ్యులు వీరిప్రేమను అంగీకరించి పెళ్లి చేయాలని అనుకున్నా ప్రేమికులిద్దరూ విగజీవులుగా మారటం  పెద్ద సస్పెన్స్ గా మారింది.  ఈ సస్పెన్స్ వీడాల్సి ఉంది.