Pawan Kalyan Fan Dies : పవన్ కల్యాణ్ కొండగట్టు టూర్ లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో అభిమాని మృతి

జనసేనాని పవన్ కల్యాణ్ జగిత్యాల పర్యటనలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పవన్ అభిమాని మృతి చెందాడు. పవన్ కాన్వాయ్ వెనుక వెళ్తున్న అభిమాని బైక్ ఎదురుగా వస్తున్న మరో బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పవన్ అభిమాని అక్కడికక్కడే మృతి చెందాడు.

Pawan Kalyan Fan Dies : పవన్ కల్యాణ్ కొండగట్టు టూర్ లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో అభిమాని మృతి

Pawan Kalyan Fan Dies : జనసేనాని పవన్ కల్యాణ్ జగిత్యాల పర్యటనలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పవన్ అభిమాని మృతి చెందాడు. పవన్ కాన్వాయ్ వెనుక వెళ్తున్న అభిమాని బైక్ ఎదురుగా వస్తున్న మరో బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పవన్ అభిమాని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలైనట్లు తెలుస్తోంది. వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట స్టేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని రాజ్ కుమార్ గా గుర్తించారు.

ధర్మపరి పర్యటన ముగించుకుని పవన్ కల్యాణ్ హైదరాబాద్ తిరుగు పయనం అయ్యారు. పవన్ కాన్వాయ్ ని వెంబడిస్తూ అభిమానులంతా బైక్ లపై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కిషన్ రావు పేట స్టేజి దగ్గర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న మరో బైక్ ను పవన్ అభిమాని నడుపుతున్న బైక్ ఢీకొట్టింది. ఆ బైక్ మరో కారుని ఢీకొంది. ఈ ఘటనలో రాజ్ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు. అంజి, శ్రీనివాస్, సాగర్ ఈ ముగ్గురూ కూడా తీవ్రంగా గాయపడ్డారు.

వీరంతా పవన్ కల్యాణ్ అభిమానులు. తమ అభిమాన హీరో పవన్ కల్యాణ్ ధర్మపురికి వస్తున్నాడని తెలుసుకుని వీరంతా ధర్మపురికి వెళ్లారు. ఆ తర్వాత పవన్ కాన్వాయ్ ను అనుసరిస్తూ వేగంగా ముందుకు వచ్చిన క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్ వెంట వెళ్తున్న సమయంలో బైక్ అదుపు తప్పింది. కంట్రోల్ కాకపోవడంతో మరో బైకును బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన రాజ్ కుమార్ స్పాట్ లోనే చనిపోయాడు.

మృతుడు, గాయపడ్డ వారు అంతా పవన్ కల్యాణ్ అభిమానులు. తమ అభిమానాన్ని చాటుకునేందుకు వారంతా ఆత్రుతగా ముందుకెళ్లి ప్రమాదం బారినపడ్డారు. పవన్ కల్యాణ్ పై తమ అభిమానం చాటుకునేందుకు వచ్చి రాజ్ కుమార్ చనిపోవడం, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటం స్థానికంగా విషాదం నింపింది. రాజ్ కుమార్ ఇంట్లో విషాదం అలుముకుంది.