Extra Marital Affair : కాంట్రాక్ట్ కిల్లర్స్‌తో మాజీ జవాన్‌ను చంపించిన హెడ్ కానిస్టేబుల్

వివాహేతర సంబంధంలో అడ్డుగా ఉన్నాడని మాజీ జవాన్‌ను    హత్య చేసేందుకు ఒక క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబులు కుట్ర పన్ని కిల్లర్ గ్యాంగ్ తొ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Extra Marital Affair : కాంట్రాక్ట్ కిల్లర్స్‌తో మాజీ జవాన్‌ను చంపించిన హెడ్ కానిస్టేబుల్

Delhi Cop Arrested

Extra Marital Affair :  వివాహేతర సంబంధంలో అడ్డుగా ఉన్నాడని మాజీ జవాన్‌ను    హత్య చేసేందుకు ఒక క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబులు కుట్ర పన్ని కిల్లర్ గ్యాంగ్ తొ ఒప్పందం కుదుర్చుకున్నాడు.  ఢిల్లీలోని జ్యోతి నగర్ లో నివసించే సుధీర్ కుమార్ ఆర్మీ సప్లై  కోర్  స్టోర్ కీపర్ గాపని చేసి మే 31న రిటైర్ అయ్యాడు.

అతని భార్యకు ఘన్ శ్యామ్ అనే క్రైం బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌తో   వివాహేతర సంబంధం ఉంది.  భర్త రిటైర్ అవటంతో వీరిద్దిరూ ఎంజాయ్ చేయటానికి కుదరటం లేదు.  భర్త ఎంతసేపు ఇంట్లో వే ఉండటంతో వీరి సంబంధానికి అడ్డుగా ఉన్నాడు.   భర్తను అడ్డతోలగించుకోవాలని తన ప్రియుడైన హెడ్ కానిస్టేబుల్ కు చెప్పింది జవాన్ భార్య.

Also Read : Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

దీంతో కానిస్టేబుల్ ఇద్దరు కాంట్రాక్ట్    కిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకుని వారికి డబ్బులు ఇచ్చాడు.  దుండగులు ఇద్దరూ సెప్టెంబర్ 10న సుధీర్ కుమార్ పై  దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.  ఆయన్ను  చికిత్స నిమిత్తం  బీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఢిల్లీ కాంట్ ఆర్మీ   రిఫరల్ ఆస్పత్రికి తరించారు. అక్కడ చికిత్స పొందుతూ  సుధీర్ కుమార్ సెప్టెంబర్ 16న కన్నుమూశాడు.

కేసు నమోదు చేసుకున్న  పోలీసులు ఇంటి వద్ద సీసీటీవీ  విజువల్స్ పరిశీలించారు.    గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అతని ఇంటివద్ద రెక్కీ నిర్వహించటం గమనించారు.   విచారణలో సుధీర్ కుమార్ భార్య వివాహేతర సంబంధం బయటపడింది.  దీంతో పోలీసులు  ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆందులో భాగంగా ఆమె ప్రియుడు  ఢిల్లీ క్రైం బ్రాంచ్ హె డ్ కానిస్టేబుల్ ఘన్ శ్యామ్ ను అదుపులోకి తీసుకువి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతనిపై   హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు ….. పరారీలో ఉన్నా దుండగులు కోసం గాలింపు చేపట్టారు.