Hanamkonda : అనుమానాస్పద స్ధితిలో గర్భిణి మృతి
హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గర్భిణిగా ఉన్న బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య చేసుకుంది. కేయూ పోలీసు స్టేషన్ పరిధిలో బ్యాంక్ కాలనీలో నివసించే అనూష బ్యాంక్ మేనేజర్ గా పని చేస్
Hanamkonda : హన్మకొండ బ్యాంక్కాలనీలో దారుణం చోటుచేసుకుంది గర్భిణీగా ఉన్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని భర్త, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్టు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
యూనియన్ బ్యాంక్లో మేనేజర్ గా పని చేస్తున్న అనూషకు, అదే బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేసే ప్రవీణ్తో 2019లో వివాహం అయ్యింది. వివాహ సమయంలో 25 లక్షల రూపాయలను వరకట్నంగాను, బంగారు ఆభరణాలు పెట్టుపోతలు గా పెట్టామని అనూష కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పెళ్లైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం నిత్యం మృతురాలిని ప్రవీణ్ వేధించేవాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మృతురాలు అనూష యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తోంది.
Also Read : Chain Snatching : గొలుసు తెంచుకుపోయే క్రమంలో ఐదు నెలల పసి బిడ్డ మృతి
అనూష పైన తీవ్రమైన అనుమానం పెంచుకున్న భర్త ప్రవీణ్ నిత్యం ఆమెను మానసికంగా శారీరకంగా వేధించేవాడని అనుష తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అనూష పనిచేసే బ్యాంకులో తోటి సిబ్బందితో మాట్లాడినా అనుమానం పెంచుకుని నిత్యం వేధించే వాడని ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరిగా స్పందించకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని బంధువులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.