Crime news : పూజకోసం గుడికొచ్చిన భక్తురాలిని హత్యచేసిన పూజారి.. అరెస్ట్ చేసిన పోలీసులు..

హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరిలో దారుణం చోటు చేసుకుంది. దేవాలయంలో పూజకోసమని వచ్చిన మహిళను పూజారి హత్యచేశాడు. మహిళ వద్ద నగల కోసం ...

Crime news : పూజకోసం గుడికొచ్చిన భక్తురాలిని హత్యచేసిన పూజారి.. అరెస్ట్ చేసిన పోలీసులు..

Crime News

Crime news : హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరిలో దారుణం చోటు చేసుకుంది. దేవాలయంలో పూజకోసమని వచ్చిన మహిళను పూజారి హత్యచేశాడు. మహిళ వద్ద నగల కోసం ఈ దారుణానికి వడిగట్టాడు. మల్కాజ్ గిరిలో విష్ణుపురి కాలనీలో స్వయంభూ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో మురళీ కృష్ణ అనే వ్యక్తి పూజారిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివాసముండే ఉమాదేవి(57) అనే మహిళ నిత్యం ఆలయానికి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు వస్తుంటుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పూజారికి ఉమాదేవి నగలపై కన్నుపడింది. వీటిని ఎలాగైనా దొంగిలించి విక్రయిస్తే తన ఇబ్బందులు తీరుతాయని పూజారి తప్పుడు ఆలోచన చేశాడు.

Crime news : ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన ఇల్లాలు.. మూడ్నెళ్ల తరువాత వీడిన మిస్టరీ.. ఎలా దొరికారంటే?

అనుకున్నవిధంగా ఈనెల 20న స్వామివారికి పూజలు నిర్వహించేందుకు ఉమాదేవి ఆలయానికి వచ్చింది. పూజా కార్యక్రమాల అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో అక్షింతలు వేస్తానని మురళీ కృష్ట పిలిచాడు. దీంతో పూజారి ఆశీర్వాదం తీసుకుంటున్న క్రమంలో మహిళల తలపై రాడ్ తో మోదాడు. మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ లో పెట్టి, గుడి ఆవరణను శుభ్రం చేశాడు. గుడి పరిసర ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్ ఉమాదేవి మృత దేహాన్ని పడేశాడు. ఉమాదేవి కనిపించక పోవటంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు క్రమంలో పూజారిపై అనుమానం రావడంతో విచారించగా అసలు విషయం బయటకొచ్చింది.

Crime news : పోర్న్ వీడియోలు చూసి.. భార్యను హత్యచేసిన భర్త.. అసలేం జరిగిందంటే?

నగల కోసమే తాను మహిళ హత్యకు పాల్పడాల్సి వచ్చిందని పూజారి పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. గుడి పూజారి మురళిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. అదేవిధంగా పూజారి నుంచి బంగారు నగలు కొనుగోలు చేసిన నగల వ్యాపారి నందకిషోర్ ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. 10 తులాల బంగారం, హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్, డ్రమ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.