Rajasthan: దళిత యువతిని బంధించి సామూహిక అత్యాచారం
రాజస్థాన్, అజ్మేర్ జిల్లాలో దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితుడు ఆమె కుటుంబానికి తెలిసిన పూజారే కావడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Rajasthan: రాజస్థాన్లో దారుణం జరిగింది. పాతికేళ్ల దళిత యువతిని బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆమె కుటుంబానికి పూజలు నిర్వహించే పూజారి. తాజా ఘటన రాజస్థాన్, అజ్మేర్ జిల్లాలో జరిగింది.
Jharkhand Shocker: భార్యపై అనుమానం.. కోపంతో నాలుగేళ్ల కూతురుకు నిప్పంటించిన తండ్రి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె కుటుంబానికి సంజయ్ శర్మ అనే వ్యక్తి పూజలు నిర్వహిస్తుండేవాడు. ఇటీవల బాధిత మహిళ బయటకు వెళ్లినప్పుడు సంజయ్ శర్మ ఆమెకు మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మరికొందరు అత్యాచారం చేశారు. ఈ ఘటనను సంజయ్ వీడియో తీశాడు. తన భార్య బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్యాచారానికి పాల్పడ్డ తర్వాత నిందితులు తర్వాత బాధిత మహిళను పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెలలో కూడా అనేక సార్లు నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆమె పేర్కొంది.
Dengue Cases: బెంగాల్లో విజృంభిస్తున్న డెంగీ కేసులు.. ఒక్క నెలలోనే 20 వేలకుపైగా నమోదు
తనను అత్యాచారం చేసినప్పుడు తీసిన వీడియోలు బయటపెడతానని, అలాగే తన మాట వినకుంటే ఆమెను, భర్తను చంపుతానని అతడు బెదిరించినట్లు, వీడియోల్ని అడ్డం పెట్టుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారం చేయడం వల్ల ఎంతమంది తనపై అత్యాచారం చేశారో ఆమె చెప్పలేకపోతుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.