Nandyal : లక్ష విలువ చేసే ఫోన్ కొట్టేసిన స్మార్ట్ దొంగ

దొంగ లక్ష యాభై వేల రూపాయలు విలువ చేసే ఫోన్ ను కొట్టేశాడు. ఈ చోరీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Nandyal : లక్ష విలువ చేసే ఫోన్ కొట్టేసిన స్మార్ట్ దొంగ

Phone

Samsung Smart phone : దొంగలు స్మార్ట్ గా మారిపోతున్నారు. ఎవరి కంట పడకుండా…విలువైన వస్తువులను దోచేస్తున్నారు. ఓ దొంగ లక్షా యాభై వేల రూపాయలు విలువ చేసే ఫోన్ ను కొట్టేశాడు. ఈ చోరీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాప్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్, తలకు టోపీ, జెర్కిన్ వేసుకున్నాడా ఆ దొంగ. దీంతో ఆ దొంగను పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. ఈ ఘటన నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది.

Read More : Chandrababu : భయపెట్టాలని చూస్తారా ? అస్సలు భయపడను – చంద్రబాబు

నంద్యాలలో శ్యాంసంగ్ షోరూం ఉంది. కస్టమర్ లా ఓ వ్యక్తి వచ్చాడు. ఖరీదైన సెల్ ఫోన్ కావాలని చెప్పడంతో అక్కడున్న సిబ్బంది ఫోన్ లను చూపెడుతున్నారు. అందులో శ్యాంసంగ్ Z ఫ్లిప్3 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. కొన్నట్లు బిల్డప్ ఇచ్చిన ఆ దొంగ..మరికాస్తా ఖరీదైన ఫోన్ కావాలని చెప్పాడు. సిబ్బంది ఫోన్ తీయడానికి వెళ్లారు. వెంటనే ఆ శ్యాంసంగ్ ఫోన్ ను ఎవరి కంట పడకుండా జేబులో పెట్టుకున్నాడు. అనంతరం రోడ్డుకు అడ్డంగా బైక్ ఉందని..దానిని పక్కకు పెట్టి..ఇప్పుడే వస్తానని చెప్పాడు.

Read More : Kondapalli : హైకోర్టు తీర్పు మీదే ఆధారపడ్డ కొండపల్లి చైర్మన్ ఎన్నిక..!

అనంతరం మరో వ్యక్తి వచ్చి…శ్యాంసంగ్ z ప్లిప్ 3 5G స్మార్ట్ ఫోన్ ఉందా అని అడిగాడు. ఫోన్ కోసం చూడగా..ఆ వ్యక్తి మరలా రాలేదని సిబ్బంది గ్రహించారు. ఫోన్ కూడా కనిపించలేదు. దీంతో ఫోన్ దొంగిలించాడని గ్రహించారు. సీసీ కెమెరా ఫుటేజ్ చూడగా..ముఖానికి మాస్క్, తలకు టోపీ, జెర్కిన్ వేసుకున్నట్లు గుర్తించారు. అనంతరం షోరూం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగిలింబడిన ఫోన్ ఖరీదు లక్షా యాభై వేల రూపాయలు ఉంటుందని గుర్తించారు.