Tamilnadu : హెడ్మాస్టర్ పాడుబుద్ధి… మాట్లాడాలని గదిలోకి పిలిచి ..

విద్యాబుధ్ధులు నేర్పించి  పిల్లల్ని ప్రయోజకులను  చేయాల్సిన గురువులే కీచకులుగా మారుతున్నారు.

Tamilnadu : హెడ్మాస్టర్ పాడుబుద్ధి… మాట్లాడాలని గదిలోకి పిలిచి ..

Tamilnadu Molestation

Tamilnadu :  విద్యాబుధ్ధులు నేర్పించి  పిల్లల్ని ప్రయోజకులను  చేయాల్సిన గురువులే కీచకులుగా మారుతున్నారు. 55 ఏళ్ల   హడ్ మాస్టర్ 5 వ తరగతి విద్యార్దిని   లైంగికంగా వేధించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.  వేలూరు జిల్లా పేర్నంబట్టు పంచాయతీలోని మాచంబట్టు  గ్రామంలో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఉంది. అందులో పేర్నంబట్టు గ్రామం  ఆలయ వీధికి చెందిన పాల్ వణ్ణన్   హెచ్ఎంగా పనిచేస్తున్నాడు.

ఈ పాఠశాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కనీసం 70 మంది పిల్లలు వచ్చి చదువుకుంటూ ఉంటారు.  పాల్ వణ్ణన్ తో పాటు మరో ఉపాధ్యాయుడు కూడా స్కూల్ లో పని చేస్తున్నాడు. ఇలా ఉండగా విద్యార్ధులు మధ్యాహ్నం భోజనం చేయటానికి  వెళుతుండగా పాల్ వణ్ణన్ 5 వతరగతి చదువుతున్న ఒక బాలికను తన గదిలోకి పిలిచి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఈ విషయం ఇదే పాఠశాలలో చదువుతున్న బాధితురాలి బంధువు అయిన మరో బాలిక చూసింది.  దీంతో హెచ్ ఎం ఆ బాలికను కొట్టాడు. బాలికలిద్దరూ ఇంటికి వెళ్లగానే వారి తల్లితండ్రులకు   జరిగిన విషయం చెప్పారు.  దీంతో బాధిత బాలిక తల్లితండ్రులు ఉమరాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాల్ వణ్ణన్  పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, శనివారం అదుపులోకి  తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Also Read : Chhattisgarh : రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలు…డిపార్ట్‌మెంట్‌కు అప్పచెప్పిన పోలీసు కానిస్టేబుల్