Telangana Government : టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరింది. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరడంతో అన్ని నియామక బోర్డులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహిస్తున్నారు.

Telangana Government : టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

TSPSC

Telangana Government : టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరింది. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరడంతో అన్ని నియామక బోర్డులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్రూప్-1 పేపర్ కూడా లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గురుకుల ప్రిన్సిపల్ పరీక్లల్లోనూ అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో అభ్యర్థులు రోడ్డెక్కారు. కమిషన్ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

టీఎస్ పీఎస్ సీ ప్రశ్నా పత్రాల లీకేజీలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు ప్రవీణ్ కు యువతులతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయని పోలీసులు తేల్చారు. ప్రవీణ్ 2017లో టీఎస్పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్గా చేరారు. నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్ లో ప్రవీణ్ పని చేశారు. వెరిఫికేషన్ సెక్షన్ కు వచ్చే మహిళల ఫోన్ నెంబర్లను ప్రవీణ్ తీసుకున్నారు. దరఖాస్తు సందర్భంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించి మహిళలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో ఎక్కువ సంఖ్యలో మహిళల నెంబర్లు పోలీసులు గుర్తించారు.

TSPSC Paper Leak : టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ లో వెలుగులోకి సంచలన విషయాలు

వాట్సప్ చాటింగ్ లోనూ మహిళల నగ్న ఫోటోలు దృశ్యాలను గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్ అయిందని పోలీసులు తేల్చారు. ప్రవీణ్, రేణుక రెండు ఫోన్ లను ఎఫ్ఎస్ఎల్ కు పోలీసులు పంపారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినప్పటి నుండి జరిగిన చాటింగ్ రికవరీ చేసే పనిలో ఉన్నారు. రేణుక చెప్పినందుకే పేపర్ లీక్ చేసినట్టు పోలీసులు తేల్చారు. ఇది వరకు ఏమైనా పేపర్ లు లీక్ అయ్యాయా అనే కోణంలోనూ పోలీసులు అరా తీస్తున్నారు.

టీస్పీపీస్సీలో గ్రూప్-1 పరీక్ష పేపర్లు కూడా లీక్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీ నిందితుడు ప్రవీణ్ గ్రూప్-1 పరీక్ష రాసినట్టు తెలుస్తోంది. దాదాపుగా 100కు పైగా గ్రూప్-1లో మార్కులు సాధించినట్టు సమాచారం. బబ్లింగ్ తప్పు చేయడం వల్ల డిస్ క్వాలిఫై అయినట్టు తెలుస్తోంది. TSPSC నిర్వహించిన అన్ని పరీక్షలపై విచారణ జరిపించాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.