Shamshabad : లీజు పూర్తయ్యింది…ఖాళీ చేయమని అడిగినందుకు దాడి-8 మందికి గాయాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దారుణం  జరిగింది.  భూమిని లీజుకు తీసుకున్న వ్యక్తులను, గడువు ముగిసింది ఖాళీ చేయమని అడిగినందుకు భూమి యజమానుల పై దాడి చేసిన ఘటన చోటు చ

Shamshabad : లీజు పూర్తయ్యింది…ఖాళీ చేయమని అడిగినందుకు దాడి-8 మందికి గాయాలు

Shamshabad police station

Shamshabad  : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దారుణం  జరిగింది.  భూమిని లీజుకు తీసుకున్న వ్యక్తులను, గడువు ముగిసింది ఖాళీ చేయమని అడిగినందుకు భూమి యజమానుల పై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.

శంషాబాద్  మున్సిపాలిటీ పరిధిలోని  చారినగర్  శివారు‌లో   జైపాల్ రెడ్డి, శివానందరెడ్డిలకు చెందిన 5ఎకరాల భూమిని హైదరాబాద్ బార్కస్, పాతబస్తీ  ప్రాంతానికి   చెందిన సయీద్ ఖలీఫా,అహ్మద్ ఖలీఫా, ఫైసల్ ఖలీఫా, మరో ఇద్దరు కలిసి 5 సంవత్సరల క్రితం 5 ఏళ్ళకు భూమిని లీజ్ కు తీసుకున్నారు.

లీజు గడువు  ముగిసినా వారు అందులోనే కొనసాగుతున్నారు.  ఖాళీ చేసి వెళ్లలేదు.  లీజు గడువు ముగిసి  పోవటంతో ఇటీవల  జైపాల్ రెడ్డి, శివానందరెడ్డిలు తమ భూమిని తమకు అప్పగించాలని, అక్కడి నుంచి  ఖాళీ చేసి  వెళ్లిపోవాలని కోరారు. అయినా వారు వినలేదు.
Also Read : Apsara Rani: కోరిక తీరిస్తేనే ఛాన్స్.. క్యాస్టింగ్ కౌచ్‌పై అప్సర!
ఈరోజు   గ్రామస్తులతో కలిసి భూమి యజమానులు లీజు దారులతో   భూమి ఖాళీ చేసి వెళ్లిపోవాలని గట్టిగా చెప్పారు.   దీంతో కక్ష పెంచుకున్న లీజుదారులు  సయూద్ ఖలీఫా ఇతర భాగస్వాములు మరికొందరితో   వచ్చి  వారిపై  దాడి చేసారు. ఈ దాడిలో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.