Three Terrorists Killed : జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ ద్రాస్‌ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.

Three Terrorists Killed : జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Three Terrorists Killed

Three terrorists killed : జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ ద్రాస్‌ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారని ఏడీజీపీ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఉగ్రవాదులు హసన్‌ బిన్‌ యాకూబ్‌, జంషెడ్‌ హతమయ్యారు. ఈ నెల 2న పుల్వామాలోని పింగలానాలో ఎస్పీఓ జావేద్‌ దార్‌, సెప్టెంబర్‌ 24న పుల్వామాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీని హత్య చేసిన వీరిద్దరు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

jammu kashmir Encounter : జమ్ము కశ్మీర్ ఎన్ కౌంటర్ లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసఫ్ కంత్రు హతం

అదే సమయంలో ములులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌కు చెందిన స్థానిక ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. ప్రస్తుతం ఇంకా ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.