Hyderabad : మహిళపై దాడి ముగ్గురు యువతులు అరెస్ట్
హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఒక బ్యూటీ థెరపిస్టుపై ముగ్గురు యువతులు దాడి చేశారు. ముగ్గురు యువతులను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు.
Hyderabad : హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఒక బ్యూటీ థెరపిస్టుపై ముగ్గురు యువతులు దాడి చేశారు. ముగ్గురు యువతులను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు.
బెంగాల్కు చెందిన బిశ్వాస్ బ్యూటీ థెరపిస్టుగా పని చేస్తోంది. ఆమెకు హైదరాబాద్కు చెందిన సంజన ఒక ఫంక్షన్ లో పరిచయం అయ్యింది. వాళ్లిద్దరూ స్నేహితులయ్యారు. హైదరాబాద్ వస్తే మంచి అవకాశాలు వస్తాయని సంజన చెప్పటంతో బిశ్వాస్ హైదరాబాద్ వచ్చి సంజన ఇంట్లో నివసించసాగింది.
అక్కడ ఆమెకు సంజన స్నేహితులు కోమటి, సునీతలు పరిచయం అయ్యారు. వారు ఆమెకు కొత్త ప్రపోజల్ చెప్పారు. కస్టమర్లతో లైంగిక సంపర్కంలో పాల్గోంటే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పారు. అందుకు ఆమె కూడా ఒప్పుకుంది. ఈ క్రమంలో వారు బిశ్వాస్ను గురువారం ఒక కస్టమర్ వద్దకు పంపించారు.
అక్కడ బిశ్వాస్ కస్టమర్ కు సహకరించకపోవటంతో… అతను బిశ్వాస్ పై ముగ్గురు స్నేహితురాళ్లకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ముగ్గురు బిశ్వాస్ వద్దకు వచ్చి గొడవ పెట్టుకున్నారు. దీంతో ఆమె 100 కు డయల్ చేసి పోలీసులు సహయం కోరింది. అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గురు యువతులను పంపించి వేశారు. పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటి తర్వాత ముగ్గురు యువతులు తిరిగి వచ్చి బిశ్వాస్ను వివస్త్రను చేసి, ఐరన్ రాడ్తో కొట్టి, ఒంటిపై శానిటైజర్ పోయటానికి ప్రయత్నించారు.
అనంతరం ఆమెను బాత్ రూమ్ లో పెట్టి పరారయ్యారు. బాధిత మహిళ బాత్ రూం కిటికీ వద్ద నుంచి కేకలు పెట్టగా సెక్యూరిటీ గార్డు విని ఆమెను రక్షించాడు. దీంతో బిశ్వాస్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపి ముగ్గురు మహిళలైన కోమటి, సంజన, సునీతలను అరెస్ట్ చేసి జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించారు.