Shamshabad : శంషాబాద్‌లో దారుణం.. పెట్రోల్ పోసి మహిళను హత్యచేసి దుండగులు

గుర్తు తెలియని మహిళను దుండగులు దారుణంగా హత్యచేశారు. హత్యచేసిన తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించారు.

Shamshabad : శంషాబాద్‌లో దారుణం.. పెట్రోల్ పోసి మహిళను హత్యచేసి దుండగులు

Shamshabad Woman Dead

Shamshabad Woman Dead Body: సైబరాబాద్ కమిషనరేట్ పరిధి శంషాబాద్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళను దుండగులు దారుణంగా హత్యచేశారు. హత్యచేసిన తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. సాయి ఎన్‌క్లేవ్‌లోని మధురానగర్‌లో గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్ రంగంలోకిదిగి నిందితుల ఆధారాలకోసం వెతుకులాట ప్రారంభించారు. మరోవైపు పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. మహిళ మృతదేహంకు దుండగుడు నిప్పంటించి పారిపోతున్నట్లు కనిపించింది.

Crime News: ప్రసిద్ధ పుణ్యక్షేత్ర సమీపంలో 12 ఏళ్ల బాలికను ఘోరాతి ఘోరంగా..

శంషాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి నిందితులకోసం గాలిస్తున్నారు. స్థానికంగా అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్, స్థానికుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే, మహిళను దారుణంగా హత్యచేసింది ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తులే అయి ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

Crime News: పార్కులో ఉన్న అమ్మాయిని అతి దారుణంగా చంపేసిన యువకుడు

దారుణ హత్యకు గురైన మహిళ వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే, మహిళను ఎందుకు చంపాల్సి వచ్చింది. పాత తగాదాలు ఏమైనా ఉన్నాయా.. మహిళను అత్యాచారం చేసి హత్య చేశారా అనే అనుమానాలుకూడా వ్యక్తమవుతున్నాయి. మహిళకోసం చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ లలో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.