Tripura : ఎస్సైతో సహా ఐదుగురిని హత్య చేసిన తాపీ మేస్త్రీ
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఘోరం చోటు చేసుకుంది. తన ఇద్దరు మైనర్ కూతుళ్లు, ఒక ఎస్సైతో సహా ఐదుగురిని హతమార్చాడో ఉన్మాది.
Tripura : ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఘోరం చోటు చేసుకుంది. తన ఇద్దరు మైనర్ కూతుళ్లు, ఒక ఎస్సైతో సహా ఐదుగురిని హతమార్చాడో ఉన్మాది. వివరాల్లోకి వెళితే ఖోవై జిల్లాలోని రామచంద్రఘాట్కు చెందిన ప్రదీప్ దేబ్రాయ్ (40) అనే వ్యక్తి తాపీ మేస్త్రీగా పనిచేస్తూ ఉండేవాడు.
శుక్రవారం రాత్రి గం.11-30 సమయంలో ఉన్నట్టుండి ఇనుపరాడ్ తీసుకుని తన ఇద్దరు మైనర్ కూతుళ్లు అదితి దేబ్రాయ్,(1) మందిరా దేబ్రాయ్(7) భార్య, సోదరుడు అమలేష్ పై దాడి చేశాడు. ఈదాడిలో ఇద్దరు కుమార్తెలు, సోదరుడు అక్కడికక్కడే మరణించారు. ప్రదీప్ ఇంట్లోంచి బయటకు వచ్చాడు.
పెళ్లికి హజరై ఆటోలో తిరిగి వెళుతున్న కుటుంబం అతని కంటపడింది. ఆటోను అడ్డుకుని ఆటో డ్రైవర్ కృష్ణదాస్ను ఇనుప రాడ్తో కొట్టాడు. ఆటోలోని ప్రయాణికులపై కూడా దాడి చేశాడు. ఆటోడ్రైవర్ అక్కడి కక్కడే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చారు.
Also Read : Murder : దారుణం-ముక్కలు ముక్కలుగా నరికి హత్య
ఆవేశంలో ఉన్న ప్రదీప్ ఇన్స్పెక్టర్ సత్యజిత్ మల్లిక్పై కూడా ఇనుపరాడ్తో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆయన కూడా ప్రాణాలు విడిచాడు. స్దానికులతో కలిసి మిగిలిన పోలీసులు ప్రదీప్ను బంధించి అగర్తలాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రదీప్కు చికిత్స అందిస్తున్నారు. మానసిక స్ధితిలో తేడా రావటం వల్లే ఇలా ప్రవర్తించి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.