Three Mens Hang Dog To Death : వీళ్లసలు మనుషులేనా?..అత్యంత దారుణంగా కుక్కకు ఉరి వేసి చంపిన వ్యక్తులు

ఉత్తరప్రదేశ్‌లో ఆడపుట్టుకలకే కాదు మూగ జీవాలకు కూడా రక్షణ లేకుండా పోయింది అనటానికి ఓ దారుణ ఘటన నిదర్శనంగా కనిపిస్తోంది. ముగ్గురు వ్యక్తులు ఓ కుక్కను అత్యంత దారుణంగా ఉరివేసి చంపిన ఘటన వీళ్లసలు మనుషులేనా అనిపించేలా ఉంది. ఓ కుక్క మెడకు ఉరి వేసి గోడకు వేలాడదీసి చంపారు.

Three Mens Hang Dog To Death : వీళ్లసలు మనుషులేనా?..అత్యంత దారుణంగా కుక్కకు ఉరి వేసి చంపిన వ్యక్తులు

ghaziabad three mens hang dog to death disturbing clip emerges

Three Mens Hang Dog To Death : ఉత్తరప్రదేశ్‌లో ఆడపుట్టుకలకే కాదు మూగ జీవాలకు కూడా రక్షణ లేకుండా పోయింది అనటానికి ఓ దారుణ ఘటన నిదర్శనంగా కనిపిస్తోంది. ముగ్గురు వ్యక్తులు ఓ కుక్కను అత్యంత దారుణంగా ఉరివేసి చంపిన ఘటన వీళ్లసలు మనుషులేనా అనిపించేలా ఉంది. ఘజియాబాద్‌ పరిధిలోని ఎలైచిపూర్ ప్రాంతంలో కుక్క మెడకు ఉరి వేసి గోడకు వేలాడదీసి చంపారు. నిర్మాణం జరుగుతున్న ఓ భవనం వద్ద ముగ్గురు వ్యక్తులు ఒక నల్లని కుక్కనుదాని మెడకు ఉన్న చైన్‌ను గోడకు వేలాడదీశారు. ఆ తరువాత ఆ కుక్క మెడకు మరో చైన్‌ బిగించి ఇద్దరు కలిసి ఇరువైపులా లాగి ఊపిరాడకుండా చేసి చంపారు.

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో జరిగిన ఈ దారుణ సంఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై ఘజియాబాద్‌ పోలీసులు మాట్లాడుతూ..ఈ వీడియో మూడు నెలల కిందటిదని వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.