uttar pradesh : ప్రియురాలి కోసం భార్య ముక్కు కోసి జేబులో వేసుకెళ్లిపోయిన భర్త

ప్రియురాలి కోసం ఓ భర్త భార్య ముక్కు కోసుకుని జేబులో వేసుకుని పోయాడు. రక్తస్రావంతోనే పోలీసు స్టేషన్ కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది.

uttar pradesh : ప్రియురాలి కోసం భార్య ముక్కు కోసి జేబులో వేసుకెళ్లిపోయిన భర్త

UP Man Cut wife Nose

Husband Cut wife Nose : ప్రియురాలి కోసం ఓ భర్త భార్య ముక్కు కోసుకుని జేబులో వేసుకుని పోయాడు. దీంతో రక్తస్రావంతోనే పోలీసు స్టేషన్ కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య ముక్కు కోసం జేబులో వేసుకుని పారిపోయిన సదరు వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని లఖినంపూర్ ఖేరి జిల్లా. మితౌలీ ప్రాంతంలోని బన్‌స్తలి గ్రామంలోని విక్రమ్ అనే వ్యక్తి తన భార్య సీమ ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. విక్రమ్‌ భార్య పేరు సీమా దేవి. వారికి వివాహంజరిగి 12 ఏళ్లు అయ్యింది. ఈక్రమంలో విక్రమ్ కు ఓ మహిళతో పరిచమైంది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరు సంబంధం గురించి సీమాదేవికి తెలిసింది. భర్తను నిలదీసింది. అలా ఇద్దరు మధ్యా గొడవలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో గత శనివారం (జూన్ 1,2023)భార్య సీమాదేవితో విక్రమ్ గొడవ పడ్డాడు. వారి నాలుగేళ్ల కూతురు మొబైల్ చూస్తు కూర్చుంది. ఆ మొబైల్ ఇవ్వమని విక్రమ్ అడిగాడు. అయినా చిన్నారి ఇవ్వలేదు.దీంతో విక్రమ్ కోపం నషాళానికి అంటింది. చిన్నారిని పట్టుకుని చితకబాదాడు. అది చూసిన సీమాదేవి అడ్డం వెళ్లింది. ఆ కోపం కాస్తా భార్యపై చూపించిన విక్రమ్ దారుణంగా కొట్టాడు. కోపం తీరక అక్కడే ఉన్న చాకు తీసుకుని భార్య సీమాదేవి ముక్కు కోసేశాడు. ఆ తరువాత ఆ ముక్కు ముక్కను జేబులో వేసుకుని అక్కడ నుంచి పారిపోయాడు.

Inmates Escape : మధ్యప్రదేశ్ జువెనల్ హోం నుంచి 8 మంది బాల నేరస్థుల పరారీ

బాధతో సీమాదేవి పెద్ద పెద్దగా కేకలు వేసింది.దీంతో స్థానికులు వచ్చారు. విషయం తెలుసుకుని అంబులెన్స్ కు ఫోన్ చేసి సీమాదేవిని మితౌలీ ఆస్పత్రికి తరలించారు. తరువాత జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స తరువాత సీమాదేవి తల్లిదండ్రులతో కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న విక్రమ్ కోసం గాలించి పట్టుకున్నారు.

విచారణ సమయంలో సీమాదేవిని కూడా పోలీసులు పిలిచారు. గాయంతోనే హాజరైన సీమాదేవి తమకు వివాహం జరిగి 12 ఏళ్లు అయ్యిందని ప్రతీరోజు విక్రమ్ మద్యం తాగి వస్తాడని తెలిపింది. మద్యం మత్తులే తనను కొడతాడని చెప్పి వాపోయింది. మారతాడని ఎంతగానో ఎదురు చూస్తుండగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హింసిస్తున్నాడని చెప్పింది. తన పిల్లలను తనను పట్టించుకోకుండా ఇంటికి వచ్చిన ప్రతీ సారి తనను పిల్లలను కూడా కొడుతున్నాడని చెప్పింది.

Samul Prasad : రిటైర్డ్ ఐఆర్ఎస్ శాముల్ ప్రసాద్ ఇంట్లో చోరీ కేసులో రోజుకో మలుపు

దీంతో పోలీసులు విక్రమ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ కోసం జైలుకి తరలించారు.  ఈ ఘటనపై లఖింపూర్ CO సిటీ సందీప్ సింగ్ మాట్లాడుతు..మితౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బన్స్టాలీ గ్రామంలో, భర్త తన భార్యపై దాడి చేసి ఆమె ముక్కును కోసాడని..కేసు నమోదు చేసి భర్తను అరెస్టు చేసి జైలుకు తరలించి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.