Bridegroom: అత్తింటివారు ఇచ్చిన కారుతో అత్తను ఢీకొట్టి చంపిన అల్లుడు

అత్తింటి వారు పెళ్లికి కానుకగా ఇచ్చిన కారుతో అత్తనే ఢీకొట్టి చంపాడో అల్లుడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, ఇతావా జిల్లాలోని అక్బర్ పూర్ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.

Bridegroom: అత్తింటివారు ఇచ్చిన కారుతో అత్తను ఢీకొట్టి చంపిన అల్లుడు

Bridegroom: అత్తింటివారు పెళ్లి కానుకగా ఇచ్చిన కారుతో అత్తనే ఢీకొట్టి, ఆమె మరణానికి కారకుడయ్యాడో అల్లుడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, ఇతావా జిల్లాలోని అక్బర్ పూర్ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ (24) పీఏసీ జవాన్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఔరైయా గ్రామానికి చెందిన ఒక యువతితో పెళ్లి నిశ్చయమైంది.

T20 World Cup 2022: నిన్నటి మ్యాచులో విరాట్ కోహ్లీ ‘ఫేక్ ఫీల్డింగ్’కు పాల్పడ్డాడని ఆరోపణలు.. వీడియో వైరల్

ఈ క్రమంలో అత్తారింటి వాళ్లు పెళ్లికి ముందు అతడికి ఒక కారును కానుకగా ఇచ్చారు. దీంతో కొత్త కారు తీసుకున్న అరుణ్ కుమార్ కారు నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అత్తతోపాటు, ఆమె తరఫు బంధువలపైకి కారు దూసుకెళ్లింది. వేగంగా కారు దూసుకురావడంతో అత్త అక్కడికక్కడే మరణించింది. మిగతా కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అరుణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత్త మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తరలించారు. కాగా, అరుణ్ కుమార్‌కు డ్రైవింగ్ రాదని తెలిసింది. కారు టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.