Wife eloped : ఊరెళ్లేందుకు భర్తతో రైల్వే స్టేషన్ కు… అక్కడ వేరే వ్యక్తితో బైక్ పై పరారైన భార్య

భర్తతో కలిసి రాజస్ధాన్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు చేరుకున్నభార్య... అక్కడ వేరే వ్యక్తి బైక్ ఎక్కి ఉడాయించింది.

Wife eloped : ఊరెళ్లేందుకు భర్తతో రైల్వే స్టేషన్ కు… అక్కడ వేరే వ్యక్తితో బైక్ పై పరారైన భార్య

Wife Eloped

Wife eloped with unidentified man : భర్తతో కలిసి రాజస్ధాన్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు చేరుకున్నభార్య… అక్కడ వేరే వ్యక్తి బైక్ ఎక్కి ఉడాయించింది. రాజస్ధాన్ జోధ్ పూర్ బారీ ఖోకుండా రోడ్డు గ్రామానికి చెందిన ప్రభుదాస్ అనే వ్యక్తి ఎల్అండ్ టీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను 2018 లో రమ్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు.

ఏప్రిల్ 2 న ప్రభుదాస్, హైదరాబాద్ లో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి భార్య, కొడుకుతో వచ్చాడు. 2 రోజులు ఉండి  4వ తేదీ తిరిగి రాజస్ధాన్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాడు. ఆ రోజు ఉదయం 9 గంటలకు భార్య కుమారుడితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.  స్టేషన్ బయట కొద్దిసేపు  వేచి ఉన్న తర్వాత మంచినీళ్ల బాటిల్ తీసుకు వస్తానని చెప్పి కుమారుడితో వెళ్లిన రమ్య తిరిగి రాలేదు.

చాలాసేపు  భార్య కోసం ఎదురు చూసిన భర్త ఆ ప్రాంతంలో గాలించాడు.  అయినా ఆమె ఆచూకి లభించలేదు. దీంతో గోపాలపురం పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు  చేసుకున్న  పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరీశీలించగా రమ్య వేరే వ్యక్తితో బైక్ పై పారిపోయినట్లు గుర్తించారు.

తన భార్య రూ. 20 వేలు నగదు, 2 తులాల బంగారు నగలతో పరారైనట్లు అతను పోలీసులకు చెప్పాడు. రమ్య పారిపోయిన బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.