భారీ వర్షాలు : మూసీనది వరదలో కొట్టుకుపోయిన 200 ట్రాన్స్ఫార్మర్లు

  • Published By: nagamani ,Published On : October 15, 2020 / 11:40 AM IST
భారీ వర్షాలు : మూసీనది వరదలో కొట్టుకుపోయిన 200 ట్రాన్స్ఫార్మర్లు

Hyderabad Musi river floods : గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో మూసీ న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. పొంగి పొర్లుతూ ఉగ్రరూపం చూపిస్తోంది. దీంతో మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు బిక్కు బిక్కుమంటూ నివ‌సిస్తున్నారు. వర్షాలు ఇంకా కురిసే అవకాశాలు ఉంటంతో అధికారులు లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


వర్షాల కారణంగా హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సమస్య ఏర్పడింది. దీనిపై ట్రాన్స్ కో,జెన్కో సిఎండి ప్రభాకర్ రావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..’ఎన్టీపీసీ వారి సహకారంతో గ్రిడ్ కు ఇబ్బంది లేకుండా చేశామని..మన గ్రిడ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు.


కరెంట్ డిమాండ్ ఎంత తగ్గినా.. ఎంత పెరిగినా గ్రిడ్ కి ఎలాంటి ఢోకా లేదని తెలిపారు. అపార్ట్మెంట్ లలోకి నీరు రావడంతో తామే విద్యుత్ ను నిలిపి వేశాం. అంతేకాదు హైదరాబాదుకు కరెంట్ ఇబ్బంది కాదనీ తెలిపారు. పలు ప్రాంతాల్లోని సబ్ స్టేషన్ లలో వరదనీరు చేరింది. నీరు తొలిగిపోగానే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరిస్తామని తెలిపారు.


భారీ వర్షాలకు మూసి నది ప్రవాహంలో 200 ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయనీ..ఆయా ప్రాంతాల్లో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపేశామన్నారు. ఎక్కడైనా స్తంభాలు, విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.