హిజ్రాపై పెట్రోలు పోసి తగలబెట్టిన తోటి హిజ్రాలు..

  • Published By: nagamani ,Published On : October 13, 2020 / 01:55 PM IST
హిజ్రాపై పెట్రోలు పోసి తగలబెట్టిన తోటి హిజ్రాలు..

Hyderabad:హిజ్రాలను సమాజం చిన్నచూపు చూస్తుంది. కానీ హిజ్రాలే తోటి హిజ్రాలను అత్యంత దారుణం చంపిన ఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాజం నుంచి వివక్షలను ఎదుర్కొనే హిజ్రాలు అసహనంతో దాడులను దిగుతుంటారు. కానీ వారిలో వారు మాత్రం చాలా సామరస్యంగా..కలిసి మెలిసి జీవిస్తుంటారు. వారిలో ఎవరికి కష్టం వచ్చినా తోటి హిజ్రాలు ఆదుకుంటారు..అండగా ఉంటారు.


కానీ ఏం జరిగిందో తెలీదు గానీ హైదరాబాద్ లోని వారి మధ్య అంత పెద్ద అగాధం ఏం వచ్చిందో గానీ..మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ హిజ్రాను తోటి హిజ్రాలే పెట్రోలు పోసి నిప్పంటించి తగులబెట్టిన ఘటన సంచలనం రేపింది.


హిజ్రాపై పెట్రోల్ పోసి మరో హిజ్రా వర్గం నిప్పంటించారు. ఎర్రగడ్డ అవంతి నగర్‌కు చెందిన హరి ప్రసాద్ అలియాస్ హంస అనే 28 ఏళ్ల హిజ్రాకు చందానగర్‌లో నివాసం ఉంటున్న కొంత మంది హిజ్రాలతో పడటంలేదు.తరచూ హంసతో వివాదాలకు దిగుతున్నారు. ఘర్షణ పడుతున్నారు. గత కొంత కాలంగా ఇది కొనసాగుతోంది.


ఈ క్రమంలో గత ఆదివారం (అక్టోబర్ 11,2020) రాత్రి హంసకు ఓ ఫోన్ వచ్చింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో మాట్లాడుకుందాం రా అని చెప్పారు. దీంతో హంస అక్కడికి వెళ్లగా.. ఆమెపై కొంతమంది హిజ్రాలు పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడినుంచి పరారయ్యారు.


మంటల్లో తీవ్రంగా గాయపడ్డ హిజ్రా హంసను గమనించిన కొంతమంది వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం హిజ్రా హంస ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.



కాగా..ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.