Hyd Metro: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. సోమవారం నుంచి రాత్రి 11 వరకు మెట్రో

హైదరాబాద్ మెట్రో సేవల సమయాన్ని అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు ఉన్న సమయాన్ని రాత్రి 11:00 గంటల వరకు చేశారు. అంటే సంబంధిత టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. అయితే ఈ సౌకర్యం ఈ నెల 10 నుంచి అందుబాటులోకి రానున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‭వీఎస్ రెడ్డి శుక్రవారం తెలిపారు

Hyd Metro: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. సోమవారం నుంచి రాత్రి 11 వరకు మెట్రో

Hyderabad Metro

Hyd Metro: నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న సమయాన్ని రాత్రి 11:00 గంటల వరకు పెంచారు. అంటే సంబంధిత టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. అయితే ఈ సౌకర్యం ఈ నెల 10 నుంచి అందుబాటులోకి రానున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‭వీఎస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. అయితే ఉదయం సమయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటి వరకు ఉన్నట్లుగానే ఇకపై కూడా ఉదయం 6 గంటలకు సంబంధిత టెర్మినల్ నుంచి మొదటి మెట్రో రైలు బయలుదేరుతుంది.

హైదరాబాద్ మెట్రోలో మూడు ప్రధానమైన లైన్లు ఉన్నాయి. ఒకటి నాగోల్ నుంచి రాయ్‭దుర్గ్ వరకు (బ్లూ లైన్) మరొకటి మియాపూర్ నుంచి ఎల్‭బీ నగర్ వరకు (రెడ్ లైన్) ఒక చివరిది జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు (గ్రీన్ లైన్) మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. 66.5 కిలోమీటర్ల పొడవున, మూడు లైన్లలో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి. ప్రతిరోజు 4 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే తాజాగా సమయం పెంచడంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా రెడ్, బ్లూ లైన్లలో ప్రతి రెండు నిమిషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంది.

Xiaomi: ఇండియా నుంచి పాకిస్తాన్‭కు మారనున్నట్లు ప్రచారంపై షియోమి ఏమందంటే?