సోమవారం సాయంత్రంతో ముగియనున్న ఎన్నికల ప్రచారం

  • Published By: chvmurthy ,Published On : January 19, 2020 / 03:32 PM IST
సోమవారం సాయంత్రంతో ముగియనున్న ఎన్నికల ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో జనవరి 22న జరిగే పురపాలకసంఘాల ఎన్నికలకు ప్రచార గడువు జనవరి20, సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయరాదని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

సభలు, సమావేశాలకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ ద్వారా కూడా ప్రచారం చేయకూడదని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తామని ఈసీ  విడుదల చేసిన ప్రకటనలోతెలిపింది. కాగా, ఈ నెల 22న 9 నగరపాలక సంస్థలకు, 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.